News September 24, 2024

కర్ణాటక CM సిద్దరామయ్యకు షాక్

image

ముడా కుంభకోణం వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. దర్యాప్తు కోసం గవర్నర్ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూ కేటాయింపుల విషయంలో ఖరీదైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా సిద్దరామయ్య కుట్ర చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై విచారణకు గవర్నర్ ఆదేశించారు.

Similar News

News September 24, 2024

ఆహార కల్తీ కట్టడికి యూపీ సీఎం అదేశాలు

image

UPలోని అన్ని భోజ‌న త‌యారీ హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌లో చెఫ్‌లు, వెయిట‌ర్లు త‌ప్ప‌క మాస్కులు, గ్లౌజులు ధ‌రించాల‌ని CM యోగి ఆదేశించారు. అలాగే CCTV కెమెరాలు ఏర్పాటు చేయాల‌ని, నిర్వాహ‌కులు-య‌జ‌మానుల పేర్లు ప్ర‌ద‌ర్శించాల‌ని అదేశించారు. ఆహార కల్తీ ఘటనల నేప‌థ్యంలో నిర్వాహ‌కుల్లో జ‌వాబుదారీత‌నం పెంపున‌కు తాజా ఆదేశాలు ఇచ్చారు. ఆహార కల్తీని అడ్డుకోవడమే ఈ నిబంధనల లక్ష్యమని యోగి పేర్కొన్నారు.

News September 24, 2024

అమృత్ టెండర్లతో రేవంత్‌కు సంబంధం లేదు: BRS మాజీ ఎమ్మెల్యే

image

TG: అమృత్ టెండర్లపై అనవసరంగా వివాదం చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. ‘సీఎం రేవంత్ రెడ్డికి టెండర్లకు ఎలాంటి లింక్ లేదు. నా అల్లుడు సృజన్ రెడ్డి రేవంత్‌కు సొంత బావమరిది కాదు. సృజన్‌కు రాజకీయాలతో సంబంధం లేదు. కేటీఆర్‌కు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. త్వరలో ఆయన్ను కలిసి దీనిపై మాట్లాడతా. నేను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా’ అని తెలిపారు.

News September 24, 2024

పవన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ మద్దతు

image

సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణాలైనా అర్పిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతిచ్చారు. ఎవరైనా సనాతన ధర్మం జోలికి వస్తే హిందువులంతా గొంతెత్తుతామని చెప్పారు. సెక్యులరిజం రెండు దారులున్న వీధి లాంటిదన్నారు. ఇకపై తాము మౌనంగా ఉండబోమని బండి స్పష్టం చేశారు.