News September 24, 2024
APIIC ఛైర్మన్గా మంతెన రామరాజు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులను ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్ (APIIC)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే టికెట్ త్యాగానికి దక్కిన ప్రతిఫలంగా నామినేటేడ్ పోస్టు వరించిందని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 3, 2026
ప.గో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీతారాం

పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అంకెం సీతారాం నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న సీతారాంను జిల్లా పగ్గాలు వరించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News January 3, 2026
తాడేపల్లిగూడెంలో కొట్టుకు చెక్..?

తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొట్టు సత్యనారాయణపై అసంతృప్తితో ఉన్న పార్టీ నేతలు జగన్ను కలిశారని ప్రచారం సాగుతోంది. సర్పంచ్లు, ఎంపీపీలు పార్టీని వీడటంతో వడ్డీ రఘురామ్కు బాధ్యతలు అప్పగించాలని వారు కోరినట్లు సమాచారం. ఇందుకు జగన్ సానుకూలంగా స్పందించినట్లు టాక్. త్వరలోనే వడ్డీ రఘురామ్ నియామకంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని గుసగుసలు.
News January 3, 2026
భీమరం: అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

సంస్కతీ సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవరంలో సంక్రాంతి సంబరాలను డిప్యూటీ స్పీకర్, కలెక్టర్ భోగి మంటలు వేసి ప్రారంభించారు. బొమ్మలకొలువు, రంగవల్లులు, గొబ్బమ్మలు, భోగిమంట, హరిదాసులు, కోలాటం, సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.


