News September 24, 2024
ఆర్థిక సాయం పెంచుతూ ఉత్తర్వులు
AP: వరదల కారణంగా నష్టపోయిన వారికి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన దానికంటే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు రూ.11వేలకు బదులుగా రూ.25 వేలు ఇవ్వనున్నారు. మొదటి ఫ్లోర్లో ఉన్నవారికి రూ.10 వేలు, దుకాణాలకు, పంటలకు హెక్టారుకు రూ.25 వేలు అందించనున్నారు. ఇళ్లు ధ్వంసమైన వారికి ప్రభుత్వం కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వనుంది.
Similar News
News September 24, 2024
అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దు: హైడ్రా
TG: బఫర్ జోన్, FTL పరిధిలో అక్రమ నిర్మాణాల కట్టడికి హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దని ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులకు లేఖ రాసింది. రెండు రోజుల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాంకర్లతో సమావేశమై సూచనలు చేయనున్నారు. దీని కోసం ఒక లీగల్ టీమ్ను ఏర్పాటు చేశారు. ఇటీవల కూల్చిన అక్రమ కట్టడాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకుల లిస్టును సిద్ధం చేశారు.
News September 24, 2024
లెబనాన్లో 558కి పెరిగిన మృతుల సంఖ్య
హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్పై 2 రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో మృతుల సంఖ్య 558కి పెరిగింది. ఈ మేరకు లెబనీస్ ఆరోగ్య శాఖ తెలిపింది. లెబనాన్ సరిహద్దుల నుంచి హెజ్బొల్లాను తరిమేందుకు అవసరమైనదంతా చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై జరిపిన దాడుల్లో ఏడుగురు మృతిచెందారు. వరుస దాడులతో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ అదృశ్యమయ్యాడు. అతని జాడ కోసం ఇజ్రాయెల్ వెతుకుతోంది.
News September 24, 2024
2-3 రోజుల్లో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్!
AP: రాష్ట్రంలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సవరించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రేపటిలోగా ఆర్టినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశముంది. దీంతో మొత్తం 3,736 మద్యం షాపుల కేటాయింపులకు రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్స్ ఉంది.