News September 24, 2024
మహిళా కమిషన్ ఛైర్పర్సన్ లక్ష్మికి ఉద్వాసన
AP: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గజ్జల వెంకట లక్ష్మికి ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆమెను వెంటనే బాధ్యతల నుంచి తప్పిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. కాగా వెంకట లక్ష్మిని వైసీపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.
Similar News
News September 24, 2024
బాబు గారు Sit అంటే Sit, Stand అంటే Stand!: అంబటి రాంబాబు
AP: తిరుమల లడ్డూ వివాదంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘ఈ SIT బాబు గారు Sit అంటే Sit, Stand అంటే Stand!’ అని ట్వీట్ చేశారు. కాగా, లడ్డూ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రం సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
News September 24, 2024
జియో సరికొత్త ప్లాన్
టెలికం దిగ్గజం జియో సరికొత్త ప్లాన్ను యూజర్ల కోసం తీసుకొచ్చింది. 98 రోజుల వ్యాలిడిటీతో ఉండే ఈ ప్లాన్ను రూ.999కు అందిస్తోంది. ప్లాన్లో భాగంగా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటా, 100 SMSలు పంపవచ్చు. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్లకు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. రీఛార్జ్ ధరలు పెంచి జియో ఇప్పటికే వినియోగదారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.
News September 24, 2024
రాజ్యసభలో తగ్గుతోన్న వైసీపీ బలం
రాజ్యసభలో వైసీపీ బలం తగ్గిపోతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 11 నుంచి 8కి పడిపోయింది. ఇటీవల ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వైసీపీకి రాజీనామా చేయగా, తాజాగా ఆర్.కృష్ణయ్య సైతం పార్టీని వీడారు. మరికొంత మంది కూడా వైసీపీకి గుడ్బై చెబుతారని ప్రచారం జరుగుతోంది.