News September 24, 2024
దీప్తికి రూ.కోటి చెక్కు, మొగిలయ్యకు ఇంటి స్థలం
TG: పారాలింపిక్స్-2024లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ రెడ్డి రూ.కోటి చెక్కును అందజేశారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డి దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి, వరంగల్లో 500 గజాల ఇంటిస్థలం, కోచ్కు రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇక ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ గ్రహీత దర్శనం మొగిలయ్యకు HYD హయత్ నగర్లో 600 చదరపు గజాల ఇంటిస్థలం ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
Similar News
News September 25, 2024
రేపటి నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్
తెలంగాణలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ప్రొవిజినల్ జాబితాను కాళోజీ వర్సిటీ ఇవాళ విడుదల చేయనుంది. రేపు తుది మెరిట్ లిస్ట్ విడుదల కానుంది. గురువారం నుంచి రాష్ట్రంలో ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
News September 25, 2024
సెప్టెంబర్ 25: చరిత్రలో ఈరోజు
1920: ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జననం
1939: బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం
1974: ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురగదాస్ జననం
1958: స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నవ లక్ష్మీనారాయణ మరణం
2019: హాస్యనటుడు వేణుమాధవ్ మరణం
2020: ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం మరణం
➣వరల్డ్ ఫార్మాసిస్ట్ డే
News September 25, 2024
ఒకే చట్టం పరిధిలోని యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు
AP: రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో యూనివర్సిటీ వీసీలను నియమిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని యూనివర్సిటీలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కరికులమ్ మార్పునకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో ఏఐ వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.