News September 25, 2024
ఆ మ్యాచ్కోసం సర్ఫరాజ్ను రిలీజ్ చేయనున్న టీమ్ ఇండియా?
బంగ్లాదేశ్తో జరిగే రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం లేని నేపథ్యంలో అతడిని జట్టు నుంచి విడుదల చేయొచ్చని తెలుస్తోంది. ఇరానీ కప్లో ముంబై, రెస్టాఫ్ ఇండియా మధ్య త్వరలో మ్యాచ్ జరగనుంది. తమ కీలక ఆటగాడు సర్ఫరాజ్ను ఆ మ్యాచ్కోసం పంపించాలని బీసీసీఐని ముంబై కోరవచ్చని సమాచారం. శ్రేయస్ అయ్యర్, శార్దూల్ థాకూర్ తదితర ఆటగాళ్లంతా ఇరానీ కప్లో ఆడనున్నారు.
Similar News
News September 25, 2024
భూమికి భారంగా చైనా డ్యామ్!
చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. ఏకంగా 10 ట్రిలియన్ గాలన్ల నీరు అందులో నిల్వ ఉంటుంది. అంత బరువు ఒకేచోట నిల్వ ఉండటం భూమి గమనాన్ని ప్రభావితం చేస్తోంది. 0.06 సెకన్ల మేర భూ పరిభ్రమణ వేగం నెమ్మదించిందని పరిశోధకులు చెబుతున్నారు. దాని వల్ల సూర్యుడి నుంచి 2 సెంటీమీటర్ల దూరం పెరిగిందన్నారు. ఈ డ్యామ్ కారణంగా భూకంపాలు, పెను విపత్తులు సంభవిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News September 25, 2024
ఆసీస్కు మన బౌలింగ్ వేడి తగులుతుంది: మంజ్రేకర్
ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ సిరీస్కు భారత్ తమ అత్యుత్తమ పేస్ దళాన్ని తీసుకెళ్లాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించారు. ‘బుమ్రా, షమీ, సిరాజ్, ఆకాశ్ దీప్తో కూడిన టీమ్ ఇండియా పేస్ బ్యాటరీ ఎన్నడూ లేనంత బలంగా ఉంది. ఆస్ట్రేలియాకు ఆ వేడి కచ్చితంగా తగులుతుంది. మన ప్లేయర్స్ బ్యాటింగ్ బాగా చేయడమే కీలకం. సీనియర్లు బరువును మోయాలి. భారత్ ఈసారి కూడా సిరీస్ గెలుస్తుందనే అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
News September 25, 2024
VIRAL: ఆఫీస్ కుర్చీలో కూర్చొని ఆటో డ్రైవింగ్!
బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ ఆటోలోని సీటును తొలగించి, ఆఫీసు కుర్చీని బిగించుకున్నారు. అందులో కూర్చొని డ్రైవ్ చేస్తున్నారు. దీనిని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఆయనకు బ్యాక్ పెయిన్ వచ్చి అలా చేశారేమో అంటూ పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇది మోటార్ వెహికల్ యాక్ట్కు విరుద్ధమని పేర్కొంటున్నారు.