News September 25, 2024
ధర్మాచరణకు మా నాయకుడు సరైన ఉదాహరణ: నాగబాబు
హైందవ ధర్మాన్ని పవన్ కళ్యాణ్ అమితంగా నమ్ముతారని నాగబాబు ట్విటర్లో తెలిపారు. ‘కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే నడుస్తుంది. ఒక పాదమే అయినా ఆ నడక బలంగా ఉండేందుకు నా వంతు పాత్ర పోషిస్తాను. నా ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాను అని చాలాకాలం క్రితం కళ్యాణ్ బాబు నాతో చెప్పిన మాట. ధర్మాచరణకు తను సరైన ఉదాహరణ. అది ఈరోజు మళ్లీ నిరూపితమైంది’ అని అందులో పేర్కొన్నారు.
Similar News
News September 25, 2024
BREAKING: మాజీ MLA మృతి
AP: మాగుంట కుటుంబంలో విషాదం నెలకొంది. మాజీ MP, MLA మాగుంట పార్వతమ్మ(77) అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దివంగత MP సుబ్బరామిరెడ్డికి సతీమణి అయిన ఆమె.. 1996లో INC తరఫున ఒంగోలు MP, 2004లో కావలి MLAగా గెలిచారు. ప్రస్తుత MP మాగుంట శ్రీనివాసులురెడ్డికి పార్వతమ్మ వదిన. ఆమె మృతి తమ కుటుంబంలో విషాదం నింపిందని, రేపు నెల్లూరులో అంత్యక్రియలు నిర్వహిస్తామని MP వెల్లడించారు.
News September 25, 2024
ఈ ఆరుగురు క్రికెటర్లు 8 వరల్డ్ కప్స్ ఆడారు!
ఇప్పటి వరకు మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీలు 8సార్లు జరగగా ఆరుగురు క్రికెటర్లు వాటన్నింటిలోనూ ఆడారు. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఎలీస్ పెర్రీ, న్యూజిలాండ్కు చెందిన బ్యాటర్ సుజీ బేట్స్, ఆల్రౌండర్ సోఫీ డివైన్, శ్రీలంక కెప్టెన్ చామరి ఆటపట్టు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ స్టెఫానీ టేలర్ ఆ జాబితాలో ఉన్నారు. కాగా వచ్చే నెల 3 నుంచి టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ UAEలో మొదలుకానుంది.
News September 25, 2024
కారుకు గీతలు గీశారని చిన్నారులపై కేసు
TG: కారుకు గీతలు గీశారని 8 మంది పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ చిన్నారులంతా 2 నుంచి 9 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. హనుమకొండలోని ఓ ఫ్లాట్లో నివసించే CID కానిస్టేబుల్ కారుపై చిన్నారులు ఆడుకుంటూ గీతలు గీశారు. కారు మరమ్మతులకు డబ్బులు ఇస్తామని పిల్లల తల్లిదండ్రులు చెప్పినా వినకుండా ఆయన సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.