News September 25, 2024

ఈ సిటీల్లో నాన్ వెజ్ ముట్టుకోరు!

image

అసలు మాంసాహారమే ముట్టుకోని నగరాలు కూడా భారత్‌లో ఉన్నాయి. శ్రీరాముడు జన్మించినట్లు చెప్పే అయోధ్య, కృష్ణుడు తిరుగాడినట్లు చెప్పే బృందావనం, నరనారాయణులు తపస్సు చేసిన రిషీకేశ్, జైనులకు పవిత్రమైన పాలిటానా, మౌంట్ అబూ, బ్రహ్మదేవుడి ఆలయానికి పేరొందిన పుష్కర్ నగరాల్లో నాన్ వెజ్ నిషేధం. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిషేధం లేకపోయినా అక్కడి వారు స్వచ్ఛందంగా మాంసాహారానికి దూరం పాటిస్తారు.

Similar News

News September 25, 2024

కారుకు గీతలు గీశారని చిన్నారులపై కేసు

image

TG: కారుకు గీతలు గీశారని 8 మంది పిల్లలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ చిన్నారులంతా 2 నుంచి 9 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. హనుమకొండలోని ఓ ఫ్లాట్‌లో నివసించే CID కానిస్టేబుల్ కారుపై చిన్నారులు ఆడుకుంటూ గీతలు గీశారు. కారు మరమ్మతులకు డబ్బులు ఇస్తామని పిల్లల తల్లిదండ్రులు చెప్పినా వినకుండా ఆయన సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News September 25, 2024

హైదరాబాద్-అయోధ్య విమాన సర్వీసులు

image

శంషాబాద్ నుంచి రాముడి జన్మస్థానమైన అయోధ్యకు ఈ నెల 27 నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారంలో నాలుగు రోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ నెల 28 నుంచి ప్రయాగ్ రాజ్, ఆగ్రాకు కూడా రెండు సర్వీసులను ఇండిగో ప్రారంభించనుంది. వారంలో 3 రోజులు ఈ విమానాలు తిరుగుతాయి. అటు ప్రతి సోమ, మంగళవారాల్లో అగర్తల, జమ్మూలకు విమాన సర్వీసులు ఉంటాయని ఇండిగో ప్రకటించింది.

News September 25, 2024

కొత్త కోర్సు.. నేడు ప్రారంభించనున్న సీఎం

image

TG: BFSI(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్) మినీ డిగ్రీ కోర్సును CM రేవంత్ ఇవాళ ప్రారంభించనున్నారు. అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న ఈ కోర్సును డిగ్రీ, ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులకు అందిస్తారు. పట్టా పొందినవారి వివరాలతో హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రత్యేక పోర్టల్‌ రూపొందించనుంది. BFSI రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన వారిని జాబ్స్‌కు ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధిగా పనిచేయనుంది.