News September 25, 2024

రాజంపేట: అటవీ ప్రాంతంలో ప్రవేశిస్తున్న 15 మంది అరెస్టు

image

రాజంపేట పరిధిలోని సానిపాయ నిషేధిత అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్న 15 మందిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారి నుంచి రంపాలు, గొడ్డళ్లు, నాలుగు కార్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. వారిలో నలుగురు అన్నమయ్య జిల్లాకు చెందిన వారు కాగా.. 11మంది తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ఆర్ఎస్ఐ సురేశ్ అటవీశాఖ అధికారులతో కలిసి కూంబింగ్ చేపట్టారు. ఆ సమయంలో వీరు పట్టుబడ్డారు.

Similar News

News December 29, 2025

ఒంటిమిట్ట కోదండరాముడు మనకే..!

image

రాష్ట్రంలో జిల్లాల విభజనలో భాగంగా కొన్ని రోజులుగా ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్యనా లేక కడప జిల్లాలో కొనసాగించాలా అన్న సందిగ్ధతకు సోమవారం పులిస్టాప్ పడింది. సోమవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఎట్టకేలకు రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో విలీనం చేస్తూ ఆమోదం తెలిపింది. దీంతో శ్రీ కోదండరామాలయం ఉన్న ఒంటిమిట్ట మండలం కడప జిల్లాలో కొనసాగుతుండడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 29, 2025

కడప: 2025లో రైతులకు కష్టాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు

image

మరో 2 రోజుల్లో 2025కు వీడ్కోలు చెప్పి 2026కు ఆహ్వానం పలుకుతాం.. అయితే ఈ ఏడాది మిర్చి, ఉల్లి పంటలకు సరైన గిట్టుబాటు ధరలేక జిల్లా రైతులు ఇబ్బందులు పడ్డారు. అంతే కాకుండా అకాల వర్షాలతో రైతన్నను మరింత ఊబిలోకి దింపింది. ఈ ఏడాది ఉమ్మడి కడప జిల్లా నుంచి 680 మంది టీచర్లుగా.. 323 మంది కానిస్టేబుళ్లుగా ఎంపిక కావడంతో వారి కుటుంబసభ్యులు సంతోషంగా ఉన్నారు. మరి ఈ ఏడాది సంతోషపెట్టిన, బాధపెట్టిన విషయాలేంటో కామెంట్.

News December 29, 2025

ఒంటిమిట్ట: వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం

image

ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయంలో ఈ నెల 30న జరగబోయే వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆదివారం TTD ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, చంటి బిడ్డల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనట్లు TTD AE అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఆరోజు భక్తులకు ప్రసాదం, అన్న ప్రసాదం అందుబాటులో ఉంటుందని TTD DEO ప్రశాంతి తెలియజేశారు.