News September 25, 2024
ఉక్రెయిన్కు మా మద్దతు కొనసాగుతుంది: బైడెన్
ఉక్రెయిన్లో శాంతి నెలకొనే వరకూ ఆ దేశానికి తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. నాటో మిత్ర దేశాలు కలిసికట్టుగా ఉండటంతో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విఫలమైందని పేర్కొన్నారు. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు కొత్తగా నాటోలో చేరడంతో మరింత బలం చేకూరిందని చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభంతోపాటు సూడాన్లో 17 నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News September 25, 2024
డబ్బుల కోసమే నా పై ఆరోపణలు: హర్షసాయి
తనపై నార్సింగి పీఎస్లో అత్యాచార <<14188760>>కేసు <<>>నమోదు కావడంపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియాలో స్పందించారు. ‘డబ్బుల కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. నా అడ్వొకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారు. నేనేంటో నా ఫాలోవర్స్కు తెలుసు’ అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. అటు హర్షసాయి కోసం HYD పోలీసులు గాలిస్తున్నారు.
News September 25, 2024
Ease of Business: డీక్రిమినలైజ్ కోసం 300 లా పాయింట్లు షార్ట్లిస్ట్
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కు బూస్ట్ ఇచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 300 లా పాయింట్లు, సెక్షన్లను షార్ట్లిస్ట్ చేసింది. వివిధ మంత్రిత్వ శాఖల్ని సంప్రదించి వీటిలో సగం వరకు డీక్రిమినలైజ్ చేస్తామని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అన్నారు. జన్ విశ్వాస్ 2.0 కింద కంపెనీలపై రూల్స్ ఒత్తిడి తగ్గిస్తామన్నారు. ప్రతి ఎలక్ట్రానిక్ డివైజులో మేకిన్ ఇండియా పరికరం ఉండాలన్నదే తమ గోల్ అని చెప్పారు.
News September 25, 2024
బాలుగారి మధుర గాత్రం చెవులకు వినిపిస్తూనే ఉంది: సీఎం
AP: గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ‘సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ శకాన్ని తన పరం చేసుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మైమరపింపజేసే ఆయన మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. బాలుగారి వర్ధంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళి అర్పిస్తున్నాను’ అని సీఎం ట్వీట్ చేశారు.