News September 25, 2024

ఇద్దరు గ్రామపంచాయతీ కార్యదర్శులపై సస్పెండ్ వేటు

image

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం సస్పెండ్ చేశారు. పెద్దవూర మండలం పులిచెర్లకు చెందిన కార్యదర్శి కే.నాగరాజు అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అదేవిధంగా దామరచర్ల మండలం వాచ్యా తండాకు చెందిన జేపీఎస్ కే.స్వప్న విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో ఆమెను సస్పెండ్ చేశారు.

Similar News

News January 9, 2026

నార్కట్‌పల్లి: చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

image

ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టులో జనవరి 23 నుంచి 30 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

News January 9, 2026

‘చెరువుగట్టు’ అభివృద్ధికి రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్

image

చెరువుగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేశామని, వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఈ నెల 23 నుంచి 30 వరకు నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహోత్సవాలు జరగనున్నందున శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంపీ చామల, TDDCF ఛైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

News January 9, 2026

కల్తీ ఆహారం అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

image

ప్రజలకు సురక్షిత ఆహారం అందించేందుకు హోటళ్లు, దాబాలపై విస్తృత తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్‌వాడీల నుంచి ఆహార శాంపిళ్లు సేకరించి పరీక్షించాలని సూచించారు. కల్తీకి పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని, ప్రతి వ్యాపారి తప్పనిసరిగా FSSAI లైసెన్స్ పొందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆయన పేర్కొన్నారు.