News September 25, 2024
30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం

TG: రాష్ట్రంలో ఖాళీ అవనున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నట్లు CEO సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే మార్చి 29తో కరీంనగర్, NZB, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలు, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కానున్నాయి. ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ కాగా డిసెంబర్ 30న తుది జాబితా విడుదల చేస్తారు.
Similar News
News February 2, 2026
రాష్ట్రంలో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్

<
News February 2, 2026
విధ్వంసం.. ఒకే ఓవర్లో 4, 6, 6, 6, 4, 6

వరల్డ్ లెజెండ్స్ ప్రొ T20 లీగ్లో అభిమన్యు మిథున్(రాజస్థాన్ లయన్స్) విధ్వంసం సృష్టించారు. పవన్ నేగీ(ఢిల్లీ వారియర్స్) వేసిన 20వ ఓవర్లో వరుసగా 4, 6, 6, 6, 4, 6 బాదారు. 7 బంతుల్లో 33 రన్స్(471.43 స్ట్రైక్ రేటు) చేశారు. మరో ప్లేయర్ మోర్గాన్ 87 రన్స్(10 సిక్సులు, 1 ఫోర్) బాదడంతో రాజస్థాన్ 185-7 స్కోర్ చేసింది. ఛేజింగ్లో ఢిల్లీ 162 పరుగులకే ఆలౌటైంది.
News February 2, 2026
కాంగ్రెస్ ప్రభుత్వ పెట్టుబడులన్నీ కట్టుకథలే: కవిత

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడులన్నీ కట్టు కథలేనని జాగృతి చీఫ్ కవిత విమర్శించారు. ‘సింగపూర్ గేట్వే సంస్థకు వెబ్సైటూ లేదు. ₹70వేల CR పెట్టుబడి అన్న ఇన్ఫ్రా కీ డేటా సెంటర్ పార్క్ కంపెనీ USలో ₹90వేల CR, బ్రెజిల్లో ₹70వేల CRకు MOU చేసింది. గతేడాదే ఏర్పాటైన ఇది MOUల కోసమే పుట్టినట్లుంది. జయవీర్ రెడ్డి కంపెనీ నిజమైనదో కాదో చెప్పాలి. ₹10L లేని కంపెనీలు ₹వేలకోట్ల MOUలు చేశాయి’ అని అన్నారు.


