News September 25, 2024

అమరావతిలో MSME శిక్షణ కేంద్రం

image

AP: అమరావతిలో MSME 2వ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాలను కేటాయించింది. దీనిలో టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. రూ.250 కోట్ల ఖర్చుతో దీన్ని ప్రతిపాదించగా, 20 ఎకరాల భూములను కేంద్ర MSME డెవలప్‌మెంట్ కమిషనర్ పేరిట ఉచితంగా బదిలీ చేయనుంది. విశాఖలో ఉన్న మొదటి టెక్నాలజీ సెంటర్‌లో డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, PG డిప్లొమా సహా పలు MSME కోర్సులు అందిస్తోంది.

Similar News

News September 25, 2024

దేవర సినిమాకు చుక్కెదురు

image

ఏపీలో దేవర టీంకు చుక్కెదురైంది. 14 రోజుల పాటు సినిమా టికెట్ల ధరలు పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవధిని 10 రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.60 వరకూ పెంచారు.

News September 25, 2024

బెన్ స్టోక్స్ మరోసారి యూటర్న్?

image

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైట్ బాల్ క్రికెట్‌లో దేశం తరఫున ఆడాలని సెలక్టర్లు, కోచ్ కోరితే తప్పకుండా ఆడతానని ఆయన తెలిపారు. కాగా 2022లో స్టోక్స్ వన్డేలకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత 2023WCలో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ వీడ్కోలు పలికారు. ఇప్పుడు మరోసారి పునరాగమనం చేయాలని భావిస్తున్నారు.

News September 25, 2024

దేశంలో ఏ ప్రాంతాన్నీ పాకి‌స్థాన్ అనొద్దు: సుప్రీంకోర్టు

image

ఏ వర్గం పైనా క్యాజువల్ కామెంట్స్ చేయొద్దని జడ్జిలను సుప్రీంకోర్టు అప్రమత్తం చేసింది. దేశంలోని ఏ ప్రాంతాన్నీ పాకిస్థాన్‌గా పిలవొద్దని ఆదేశించింది. అది భారత ప్రాంతీయ సార్వభౌమత్వానికి వ్యతిరేకమేనని తెలిపింది. KA హైకోర్టు జడ్జి, జస్టిస్ వీ శ్రీశానందన్ ఓ కేసులో బెంగళూరులోని ముస్లిం ఆధిపత్య ప్రాంతాన్ని పాకిస్థాన్ అనడం, మహిళా లాయర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైరల్ వీడియోల కేసును సుమోటోగా విచారించింది.