News September 25, 2024
బాలుగారి మధుర గాత్రం చెవులకు వినిపిస్తూనే ఉంది: సీఎం
AP: గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ‘సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ శకాన్ని తన పరం చేసుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మైమరపింపజేసే ఆయన మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. బాలుగారి వర్ధంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళి అర్పిస్తున్నాను’ అని సీఎం ట్వీట్ చేశారు.
Similar News
News September 25, 2024
త్వరలో 35వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు: CM
TG: రాష్ట్రంలో 30 లక్షలకుపైగా నిరుద్యోగులు ఉన్నారని CM రేవంత్ అన్నారు. ‘ఉద్యోగాల భర్తీని బాధ్యతగా ఆచరణలో పెడుతున్నాం. 35వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. 2-3 నెలల్లో మరో 35 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక ప్రైవేటు సెక్టార్లో ఇండస్ట్రీ పెద్దలను పిలిచి వారి అవసరాలు తెలుసుకున్నాం. అందుకు అనుగుణంగా అభ్యర్థులకు శిక్షణ ఇస్తాం’ అని BFSI కోర్సు ప్రారంభం సందర్భంగా వ్యాఖ్యానించారు.
News September 25, 2024
‘సక్సెస్ కిడ్’కి అప్పుడే 18 ఏళ్లు!
సోషల్ మీడియాలో వైరలయిన ‘సక్సెస్ కిడ్’ గురించి తెలియని వారుండరేమో. మీలో ఎవరో ఒకరు ఈ మీమ్ స్టిక్కర్ను షేర్ చేసుంటారు. అతని పేరు సామీ గ్రైనర్. సక్సెస్ను, సంతృప్తిని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ సక్సెస్ కిడ్ ఫొటోను మీమర్స్ వాడుతుంటారు. 2007లో సామీకి 11 నెలలు ఉన్నప్పుడు ప్లోరిడా బీచ్లో ఆడుకుంటుండగా అతని తల్లి తీసిన ఫొటోతో వైరలయ్యాడు. నిన్న ఈ సక్సెస్ కిడ్కి 18 ఏళ్లు నిండాయి.
News September 25, 2024
దయచేసి ఆ వీడియో వైరల్ చేయొద్దు: రష్మీ గౌతమ్
తాను గతంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దని యాంకర్ రష్మీ గౌతమ్ కోరారు. అది 2020 కంటే ముందు ఇంటర్వ్యూ అని తెలిపారు. ఇప్పుడు ఆ వీడియోను వైరల్ చేసి పాఠకులను తప్పుదోవ పట్టించొద్దని ఆమె ట్వీట్ చేశారు. కాగా జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదైన వేళ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.