News September 25, 2024

అన్ని జిల్లాల్లో ఎయిర్‌పోర్టులు: లోకేశ్

image

AP: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలకు కావాల్సిన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. గ్రీన్ ఎనర్జీ విషయంలో మంచి విధానం అందుబాటులో ఉంది’ అని ఆయన తెలిపారు.

Similar News

News September 16, 2025

CLAT-2026కు దరఖాస్తు చేశారా?

image

జాతీయ స్థాయిలో న్యాయవిద్య కోసం CLAT-2026కు దరఖాస్తులు కోరుతున్నారు. నేషనల్ లా యూనివర్సిటీల్లో UG, PG కోర్సుల్లో ప్రవేశాలకు OCT-31వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 4000, SC, ST, దివ్యాంగులు రూ. 3,500 చెల్లించాల్సి ఉంటుంది. DEC 7న పరీక్ష నిర్వహించనున్నారు. UG కోర్సులకు ఇంటర్, PG కోర్సులకు LLB డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

News September 16, 2025

మైథాలజీ క్విజ్ – 7

image

1. మహావిష్ణువు ద్వారపాలకులెవరు?
2. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది?
3. భీష్ముడి అసలు పేరేంటి?
4. గంగోత్రి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. భాద్రపద మాసంలో చవితి రోజున వచ్చే పండుగ ఏది?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. పై ప్రశ్నలకు జవాబులను మైథాలజీ క్విజ్ – 8 (రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.
<<17697694>>మైథాలజీ క్విజ్-6 <<>>జవాబులు: 1.18 వేలు 2.దండకారణ్యం 3.మధుర 4.గుజరాత్ 5.రాఖీ

News September 16, 2025

రూ.2 లక్షల వరకు ధరలు తగ్గింపు

image

ప్రీ GST, పండుగ డిస్కౌంట్ కింద కార్ల కంపెనీ కియా ఇండియా తెలుగు రాష్ట్రాల ప్రజలకు రూ.2 లక్షల వరకు ఆఫర్ ప్రకటించింది. సెల్టోస్ మోడల్‌పై రూ.2 లక్షలు, కారెన్స్ క్లావిస్‌పై రూ.1.33 లక్షలు, కారెన్స్‌పై రూ.1.02 లక్షల తగ్గింపు పొందవచ్చని పేర్కొంది. సెప్టెంబర్ 22 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఆఫర్ ఉందని, అయితే ధరల్లో మార్పు ఉంటుందని వెల్లడించింది.