News September 25, 2024
మద్యం షాపులు ఖాళీ.. మందుబాబుల ఆవేదన
AP: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి నూతన మద్యం పాలసీ కింద తక్కువ ధరకే లిక్కర్ అందుబాటులోకి రానున్న వేళ మందుబాబులకు కొత్త చిక్కొచ్చి పడింది. చాలా మద్యంషాపులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. డిపోల నుంచి సరఫరా నిలిపివేయడంతో పాటు ఉన్న నిల్వలను అమ్మాలని ఆదేశాలుండటంతో షాపులన్నీ ఖాళీ అయ్యాయి. కొన్ని ఖరీదైన బ్రాండ్లే అందుబాటులో ఉండటంతో తమకు ఇబ్బందిగా మారిందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 25, 2024
పూజలకు పిలుపునిచ్చిన జగన్.. టీడీపీ కౌంటర్
AP: సీఎం చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు YCP నేతలంతా ఈ నెల 28న పూజల్లో పాల్గొనాలన్న జగన్ పిలుపునకు TDP కౌంటర్ ఇచ్చింది. ‘నీ కుటుంబం విగ్రహారాధన చేయదు. ఒక్కసారి కూడా భార్యను తీసుకుని పట్టు వస్త్రాలు ఇవ్వలేదు. భార్య గుడికి రాదని ఇంట్లోనే స్వామి వారి ఆలయం సెట్టింగ్ వేశావ్. లడ్డూలో జంతు కొవ్వు కలిపావ్. స్వామి వారంటే నమ్మకం, భక్తి లేని నీ లాంటి వాడా ఈ పిలుపు ఇచ్చేది?’ అని మండిపడింది.
News September 25, 2024
కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణ
TG: కాళేశ్వరం కార్పొరేషన్ అకౌంట్స్ అధికారులు ఇవాళ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ప్రాజెక్టుకు నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపు, ఉద్యోగుల జీతాల చెల్లింపు తదితర అంశాలపై వారిని కమిషన్ ప్రశ్నించింది. బిల్లుల చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగినట్లు ఆఫీసర్లు తెలిపారు. ప్రాజెక్టు చెల్లింపులపై ఆడిట్ రిపోర్ట్ ఆధారంగానే కాగ్ రిపోర్టు ఇచ్చిందని చెప్పారు.
News September 25, 2024
‘గేమ్ ఛేంజర్’ నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో ఎప్పుడంటే?
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘రా మచ్చ మచ్చ’ సాంగ్ ప్రోమోను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సాంగ్కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.