News September 25, 2024

హైడ్రా బాధితులకు అండగా ఉంటాం: KTR

image

TG: హైడ్రా బాధితులందరికీ తమ పార్టీ అండగా ఉంటుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR భరోసా ఇచ్చారు. న్యాయపరంగా ఎలాంటి అవసరం ఉన్నా తెలంగాణ భవన్‌కు వచ్చి వివరాలు అందించాలని సూచించారు. ఇక హైదరాబాద్‌లో ఆక్రమణల తొలగింపు ఉద్దేశం మంచిదే అయినా ముందు వాళ్లకు వేరేచోట ఆవాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ‘అలా కాకుండా ఉన్నపళంగా ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసుకున్న పేదల దుకాణాలను కూల్చేయడం సరికాదు’ అని KTR మండిపడ్డారు.

Similar News

News September 25, 2024

‘గేమ్ ఛేంజర్’ నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో ఎప్పుడంటే?

image

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘రా మచ్చ మచ్చ’ సాంగ్ ప్రోమోను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సాంగ్‌కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

News September 25, 2024

Stock Market: సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం హై

image

ప‌వ‌ర్, ఫైనాన్స్ రంగ షేర్లు బూస్ట్ ఇవ్వ‌డంతో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధ‌వారం జీవిత‌కాల గ‌రిష్ఠాల‌కు చేరుకున్నాయి. సెన్సెక్స్ 255 పాయింట్ల లాభంతో 85,169కు, నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 26,004కు చేరుకున్నాయి. బలమైన లిక్విడిటీ కారణంగా మార్కెట్‌లో బుల్ జోరు కొన‌సాగుతోంద‌ని, మార్కెట్లు మ‌రింత‌గా విస్త‌రించ‌వ‌చ్చ‌ని, సెన్సెక్స్‌ త్వ‌ర‌లో ల‌క్ష‌కు చేరుకోవ‌చ్చ‌ని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

News September 25, 2024

ఈ నెల 28న తిరుమలకు కాలినడకన జగన్

image

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఈ నెల 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాలి నడకన తిరుమలకు చేరుకుని పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు పార్టీ నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.