News September 25, 2024

ఖాతాల్లో రూ.25,000 జమ

image

AP: వరద బాధితుల అకౌంట్లలో ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేసింది. NTR జిల్లా కలెక్టరేట్‌లో పలువురు బాధితులకు CM చంద్రబాబు చెక్కులను అందించారు. మిగిలిన సుమారు 4 లక్షల మందికి ఖాతాల్లో జమ చేశారు. ఇళ్లు పూర్తిగా మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండేవారికి రూ.10వేలు, దుకాణాలు, తోపుడు బళ్లు, వాహనాలు, పశువులు, పంటలు నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది.

Similar News

News January 25, 2026

ఆ ఛానల్ డిబేట్లలో పాల్గొనం: BRS

image

TG: ఏబీఎన్ ఛానల్‌లో జరిగే చర్చల్లో ఇకపై తమ పార్టీ నాయకులు పాల్గొనబోరని బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో ఏబీఎన్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌, జిల్లా ఆఫీసుల్లో జరిగే సమావేశాలకు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులను ఇకపై అనుమతించబోమని ట్వీట్ చేసింది.

News January 25, 2026

సింగ‌రేణిలో మిగిలిన స్కామ్‌లను బయటపెడతాం: హరీశ్ రావు

image

TG: స్వార్థ ప్రయోజనాల కోసమే సింగరేణిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారని BRS నేత హరీశ్ రావు ఆరోపించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతోంది. సింగరేణి కార్మికులను కూడా ప్రభుత్వం మోసం చేస్తోంది. వారికి వైద్యాన్నీ దూరం చేశారు. సంస్థ అభివృద్ధి కోసం పక్కనపెట్టిన రూ.6వేల కోట్ల లెక్కతేల్చుతాం. సింగరేణిలో మిగిలిన స్కామ్‌లను బయటపెడతాం’ అని వ్యాఖ్యానించారు.

News January 25, 2026

రిపబ్లిక్ డే వేడుకల అతిథులు వీరే

image

EU నేతలు వాన్ డెర్, ఆంటోనియో (2026), ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో (2025), ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మేక్రాన్ (2024), ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ (2023), బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్సోనారో (2020), SA ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా (2019), ASEAN లీడర్లు (2018), అబుదాబి ప్రిన్స్ షేక్ మొహమద్ బిన్ (2017), ప్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ (2016), US ప్రెసిడెంట్ ఒబామా (2015), 2021, 22లో కొవిడ్‌తో గెస్ట్‌లు రాలేదు.