News September 25, 2024
ప్రభుత్వ లాంఛనాలతో మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు: ఆనం

మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతి పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి బుధవారం సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంత్యక్రియల ఏర్పాట్ల కోసం నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చర్చించారు.
Similar News
News January 8, 2026
శకటాలను అందంగా తయారుచేయండి: జేసీ

నెల్లూరులో రిప్లబిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల పరిశుభ్రతతో పాటు భద్రతకు ప్రాధాన్యమివ్వాలని పోలీస్ శాఖకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే శకటాలను అందంగా, విజ్ఞానదాయకంగా తయారుచేసి ప్రదర్శించాలని కోరారు.
News January 8, 2026
కాకాణి.. ఇప్పుడు మాట్లాడు: సోమిరెడ్డి

కండలేరు స్పిల్ వే నుంచి 500 క్యూసెక్కుల నీరు విడుదల కావడంపై సోమిరెడ్డి స్పందించారు. ‘అయ్యా.. కాకాణి గారు.. కండలేరు స్పీల్ వేపై ఇప్పుడు మాట్లాడు. గతంలో జంగిల్ క్లియరెన్స్ జరగలేదని, 100క్యూసెక్కులు కూడా ప్రవాహం ఉండదని నోరు పారేసుకున్నావు. ఇప్పుడు 500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నువ్వు వెళ్లి చూడు. జంగిల్ క్లియరెన్స్ జరిగిందా? లేదా? అనేది ఇప్పుడు చెప్పవయ్యా’ అని సోమిరెడ్డి సవాల్ చేశారు.
News January 8, 2026
కాకాణి.. ఇప్పుడు మాట్లాడు: సోమిరెడ్డి

కండలేరు స్పిల్ వే నుంచి 500 క్యూసెక్కుల నీరు విడుదల కావడంపై సోమిరెడ్డి స్పందించారు. ‘అయ్యా.. కాకాణి గారు.. కండలేరు స్పీల్ వేపై ఇప్పుడు మాట్లాడు. గతంలో జంగిల్ క్లియరెన్స్ జరగలేదని, 100క్యూసెక్కులు కూడా ప్రవాహం ఉండదని నోరు పారేసుకున్నావు. ఇప్పుడు 500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నువ్వు వెళ్లి చూడు. జంగిల్ క్లియరెన్స్ జరిగిందా? లేదా? అనేది ఇప్పుడు చెప్పవయ్యా’ అని సోమిరెడ్డి సవాల్ చేశారు.


