News September 25, 2024
Stock Market: సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం హై
పవర్, ఫైనాన్స్ రంగ షేర్లు బూస్ట్ ఇవ్వడంతో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్ 255 పాయింట్ల లాభంతో 85,169కు, నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 26,004కు చేరుకున్నాయి. బలమైన లిక్విడిటీ కారణంగా మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోందని, మార్కెట్లు మరింతగా విస్తరించవచ్చని, సెన్సెక్స్ త్వరలో లక్షకు చేరుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News September 25, 2024
డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించండి: సీఎం
TG: దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని, అర్హులకు ఇళ్లు దక్కాలని సీఎం రేవంత్ ఆదేశించారు. PMAY కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలని అధికారులకు సూచించారు. రాజీవ్ స్వగృహలో నిరుపయోగంగా ఉన్న బ్లాక్స్, ఇళ్లు వేలం వేయాలని, ఏళ్ల తరబడి వృథాగా ఉంచడం సరికాదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా వాటిని ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. అర్హులకు ఆ ఇళ్లను అప్పగించాలన్నారు.
News September 25, 2024
కేక్ కటింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు!
వేడుక ఏదైనా అందులో కేక్ కట్ చేయడం ఫ్యాషనైపోయింది. ఆ సమయంలో కొవ్వొత్తులు వెలిగించి ఊదుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘అలా ఊదడం వల్ల నోటిలోని లాలాజలం ద్వారా హానికర బ్యాక్టీరియా కేక్ ఉపరితలానికి చేరుతుంది. బ్యాక్టీరియాతో పాటు కొవ్వొత్తులు కరిగి వాటి రసాయనాలు కడుపులోకి చేరితే అనారోగ్యం పాలవుతారు’ అని తేలింది. దీన్నిబట్టి చూస్తే చిన్నారుల ముఖంపై కూడా ఊదడం మంచిది కాదన్నమాట.
News September 25, 2024
ఏపీలో 16 మంది ఐపీఎస్లు బదిలీ
☛ సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్లాల్
☛ పీ అండ్ ఎల్ ఐజీగా రవిప్రకాశ్
☛ ఇంటెలిజెన్స్ ఐజీగా PHD రామకృష్ణ
☛ ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప
☛ డీఐజీ(అడ్మిన్)గా అమ్మిరెడ్డి
☛ రోడ్ సేఫ్టీ డీఐజీగా విజయారావు
☛ లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఐజీగా సిద్ధార్థ్ కౌశల్
☛ విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా మేరీ ప్రశాంతి
పూర్తి <