News September 25, 2024
కనిష్ఠ స్థాయికి ఆర్కిటిక్ సముద్రపు మంచు
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆర్కిటిక్ సముద్రపు మంచు Sep నెలలో వార్షిక కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ఏటా ఉత్తరార్ధగోళంలో మంచు గణనీయ స్థాయిలో క్షీణిస్తోంది. నాసా, NSIDC డేటా సెంటర్ పరిశోధకుల ప్రకారం ఈ ఏడాది కనిష్ఠ పరిధి 4.28 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా నమోదైంది. సముద్రపు మంచు నష్టం ఏడాదికి 77,800 Sq.KM చొప్పున సంభవిస్తోంది. ఈ క్షీణత విస్తీర్ణంలో మాత్రమే కాకుండా మంచు నాణ్యతలో కూడా ఉంది.
Similar News
News September 25, 2024
మహిళను 59 ముక్కలుగా నరికిన నిందితుడు ఆత్మహత్య
బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి (29) హత్య <<14192326>>కేసు<<>> నిందితుడు ముక్తి రంజన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అతడి కోసం ఒడిశా వెళ్లి గాలిస్తుండగా కూలేపాడులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. కాగా మహాలక్ష్మి పని చేస్తున్న ఫ్యాక్టరీలో టీమ్ హెడ్గా ఉన్న రంజన్ కొంతకాలంగా ఆమెతో రిలేషన్లో ఉన్నాడు. మహాలక్ష్మి మరో వ్యక్తితో చనువుగా ఉండటం నచ్చక ఆమెను కిరాతకంగా చంపినట్లు సమాచారం.
News September 25, 2024
యాంగ్రీ లుక్లో ఎన్టీఆర్.. ‘దేవర’ నయా పోస్టర్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. మరో రెండు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ను ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ చేతిలో ఆయుధంతో యాంగ్రీ లుక్లో ఉన్నారు. ‘ఆయుధం రక్తం రుచి చూసింది. తర్వాతి వంతు ప్రపంచానిదే. మరో రెండు రోజుల్లో..’ అని రాసుకొచ్చింది.
News September 25, 2024
విశాఖ ఉక్కుకు పునర్వైభవం: లోకేశ్
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖ ప్రాంత కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో లోకేశ్ సమావేశమై ప్లాంట్ అంశంపై చర్చించారు. విశాఖ ఉక్కుతో ప్రతి తెలుగు వారికి అనుబంధం ఉందని చెప్పారు. ఉక్కు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కుకు పునర్వైభవం తీసుకొస్తామని వివరించారు.