News September 25, 2024
ఒత్తిడితో గుండెకు ముప్పు: అధ్యయనం
వర్క్ ప్రెషర్తో ఉద్యోగులు చనిపోతున్న వేళ ట్రూవర్త్ వెల్నెస్ అధ్యయనం వైరలవుతోంది. కార్పొరేట్ ఇండియాలో 16% ఉద్యోగులు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు తేలింది. 35-50 ఏళ్ల మధ్యలో ఉన్న 31% మందికి హార్ట్ ఎటాక్స్ వచ్చే ప్రమాదం ఉందని వెల్లడైంది. ఒకే దగ్గర కూర్చుని పనిచేయడం, స్మోకింగ్, పెరిగిన ఒత్తిడిని ప్రమాద కారకాలుగా పేర్కొంది. కాగా 20.4% మందిలో ప్రీడయాబెటిక్ షుగర్ లెవెల్స్ గుర్తించారు.
Similar News
News September 25, 2024
GREAT: రూ.6కోట్ల విలువైన భవనాన్ని దానం చేశారు!
AP: సమాజ హితాన్ని కోరుకుంటూ రూ.కోట్ల ఆస్తిని దానం చేసేవారు ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటారు. తెనాలికి చెందిన డా.ముద్దన కస్తూరిబాయి తమకు చెందిన మహిళా మండలి భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. మహిళా సాధికారతను ఆకాంక్షిస్తూ ఆమె రూ.6 కోట్ల విలువ చేసే భవనాన్ని దానం చేయడం స్ఫూర్తిదాయకం అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
News September 25, 2024
‘మేకిన్ ఇండియా’పై రాహుల్ గాంధీ చురకలు
మేకిన్ ఇండియా పేరుతో BJP అన్ని కాంట్రాక్టులను అదానీకి ఇస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. JK ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్ తయారు చేసే ఆయుధాలకు, డ్రోన్లకు అదానీ స్టిక్కర్లు అంటించి దీన్నే మేకిన్ ఇండియా అంటున్నారని, ఇది ఎలా? అంటూ ప్రశ్నించారు. GST, నోట్లరద్దు వంటివి పాలసీలు కావని, అదానీ-అంబానీలకు వ్యాపార మార్గాలు సుగమం చేయడానికి వాడిన ఆయుధాలని రాహుల్ విమర్శించారు.
News September 25, 2024
చెవిలో పేలిన ఇయర్ బడ్స్.. యువతికి శాశ్వత వినికిడి లోపం
టర్కీలో శాంసంగ్ ఇయర్ బడ్స్ చెవిలో పేలడంతో యువతికి శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తింది. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ FEని వాడుతున్న క్రమంలో పేలిందని యువతి ప్రియుడు తెలిపారు. దీనిపై శాంసంగ్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేలుడుకు గల కారణాన్ని వెల్లడించలేదన్నారు. దీంతో సేఫ్టీ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.