News September 25, 2024

భద్రాద్రి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం రోడ్డు భద్రతపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News January 13, 2026

మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించిన మంత్రి తుమ్మల

image

రఘునాథపాలెం మండలం మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే రోజున శంకుస్థాపన చేసి, నేడు నీళ్లిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. మంచుకొండ లిఫ్ట్‌తో 2,412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.

News January 13, 2026

ఖమ్మం: సంక్రాంతి సందడి.. కిరాణా షాపులు కిటకిట!

image

సంక్రాంతి పండుగ వేళ జిల్లావ్యాప్తంగా మార్కెట్లు జనసందోహంతో సందడిగా మారాయి. పిండి వంటల కోసం కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేసేవారితో కిరాణా షాపులు కిటకిటలాడుతున్నాయి. బియ్యం పిండి, నూనె, బెల్లం, నువ్వుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు భారీగా తరలిరావడంతో వర్తక వాణిజ్యాలు ఊపందుకున్నాయి. పండుగ వెలుగులతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి.

News January 13, 2026

రైతులకు ఊరట.. జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు

image

ఖమ్మం జిల్లాలో సాగు సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9,844 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. పీఏసీఎస్‌లు, ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎరువుల దుకాణదారులు ఎంఆర్‌పీ ధరలకే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.