News September 25, 2024
మహిళను 59 ముక్కలుగా నరికిన నిందితుడు ఆత్మహత్య
బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి (29) హత్య <<14192326>>కేసు<<>> నిందితుడు ముక్తి రంజన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అతడి కోసం ఒడిశా వెళ్లి గాలిస్తుండగా కూలేపాడులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. కాగా మహాలక్ష్మి పని చేస్తున్న ఫ్యాక్టరీలో టీమ్ హెడ్గా ఉన్న రంజన్ కొంతకాలంగా ఆమెతో రిలేషన్లో ఉన్నాడు. మహాలక్ష్మి మరో వ్యక్తితో చనువుగా ఉండటం నచ్చక ఆమెను కిరాతకంగా చంపినట్లు సమాచారం.
Similar News
News September 26, 2024
హెల్తీ లంగ్స్ కోసం ఇవి పాటించండి!
ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఏటా సెప్టెంబర్ 25న ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం జరుపుకుంటారు. అందరికీ స్వచ్ఛమైన గాలి అందాలి, హెల్తీ లంగ్స్ ఉండాలనేది ఈ ఏడాది థీమ్. హెల్తీ లంగ్స్ కోసం పొగాకు వాడకాన్ని తగ్గించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వద్దు. డైలీ వ్యాయామం చేయాలి. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి. హెల్తీఫుడ్ తినాలి. ఫ్లూ, నిమోనియాకి టీకాలు తీసుకోవాలంటున్నారు.
News September 26, 2024
సెప్టెంబర్ 26: చరిత్రలో ఈరోజు
1932: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జననం
1820: ప్రసిద్ధ బెంగాలీ కవి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ జననం
1867: తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జననం
1947: సంఘ సంస్కర్త బంకుపల్లె మల్లయ్యశాస్త్రి మరణం
1966: సాహిత్యవేత్త అట్లూరి పిచ్చేశ్వరరావు మరణం
✤ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం
News September 26, 2024
జంట జలాశయాలకు భారీ వరద
TG: హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వస్తుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 234 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.