News September 26, 2024
NLG: ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సిద్ధం కావాలి: జేసీ శ్రీనివాస్

ఈ సంవత్సరం వానకాలం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. బుధవారం అయన తన చాంబర్లో రైస్ మిల్లర్లతో వానాకాలం ధాన్యం కొనుగోలు, కస్టం మిల్లింగ్ రైస్( సీఎంఆర్)పై సమీక్ష నిర్వహించారు. నల్గొండ జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ ఇప్పటివరకు 90% పూర్తయిందని, తక్కిన 10శాతాన్ని ఈ వారం రోజులలో పూర్తి చేయాలన్నారు. పూర్తిచేయని వారిని డిఫాల్టర్లుగా గుర్తిస్తామన్నారు.
Similar News
News January 10, 2026
నల్గొండ: వేరే రాష్ట్రంలో దాక్కున్నా.. పోలీసులు వదల్లేదు

రెప్పపాటులో ప్రయాణికుల ఆభరణాలను మాయం చేసే అంతరాష్ట్ర ‘థార్’ ముఠా దొంగతనం ఉదంతాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానంతో 15రోజుల పాటు మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాను జల్లెడ పట్టినCCS బృందం, ముఠా సభ్యుడైన షా అల్లా రఖాను అరెస్టు చేసింది. నిందితుడి వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.
News January 10, 2026
నల్గొండ: నేటి నుంచి టీసీసీ పరీక్షలు

నల్గొండ జిల్లాలో టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. డ్రాయింగ్, టైలరింగ్ కోర్సుల కోసం జిల్లా కేంద్రంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1550 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనెల 13 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో (ఉదయం 10-1, మధ్యాహ్నం 2-5) పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
News January 10, 2026
NLG: రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి వరకు ఛాన్స్

సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. సంక్రాంతి పండుగ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని రైతులు తమ పరిధిలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2025 సంవత్సరానికి గాని పథకం అమలు కోసం ప్రభుత్వం 8 కోట్లు విడుదల చేసింది.


