News September 26, 2024

జగిత్యాల: పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ

image

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, హ్యాండ్లింగ్, లిఫ్టింగ్, ప్యాకింగ్ విభాగంలో, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీస్ జాగిలం విభాగంలో ట్రాకింగ్, ఎక్స్క్లూజివ్ విభాగాల్లో అవగాహన కల్పించారు.

Similar News

News September 17, 2025

KNR: గంటకు రూ.400 అద్దె.. ఈజీగా 4- 5 ఎకరాలకు

image

ఏరువాక పనులు ముమ్మరంగా కొనసాగుతుండడంతో జిల్లాలోని రైతులు పొలాల్లో మందుల పిచికారీ కోసం నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం డ్రోన్లలను ఆశ్రయిస్తున్నారు. రూ.400 అద్దె చెల్లించి గంట వ్యవధిలో 4- 5 ఎకరాలకు సులువుగా పిచికారీ చేస్తున్నారు. దీనికి డిమాండ్ పెరగటంతో డ్రోన్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు శంకరపట్నం, మానకొండూర్, జమ్మికుంట, PDPL జిల్లాల నుంచి వీటిని తెప్పించుకుంటున్నారు.

News September 16, 2025

పోషణ మాసోత్సవాలకు ఎమ్మెల్యే కవ్వంపల్లికి రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం

image

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరిగే పోషణ మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనాయణకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ మేరకు, కరీంనగర్ జిల్లా మహిళా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి, మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆహ్వాన పత్రాన్ని మంగళవారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో ఎమ్మెల్యేకు అందజేశారు.

News September 16, 2025

కరీంనగర్: ‘చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టాలి’

image

మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ త్వరగా చేపట్టాలని, కరీంనగర్ జిల్లాలోని మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం మత్స్య శాఖ కమిషనర్ ఐఏఎస్ నిఖిలకు కరీంనగర్ జిల్లా మత్స్యకారులు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ మత్స్యశాఖ కార్యాలయంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని, చేప పిల్లలను సకాలంలో పంపిణీ చేస్తేనే మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు.