News September 26, 2024
పీహెచ్సీ డాక్టర్లతో ముగిసిన చర్చలు
AP: పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చలు ముగిశాయి. అన్ని క్లినికల్ విభాగాల్లో 20 శాతం ఇన్ సర్వీస్ రిజర్వేషన్ ఇచ్చేందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లో చేరాలని సత్యకుమార్ వారిని కోరారు.
Similar News
News September 27, 2024
సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి: CM
TG: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. 6 నెలల్లో వీలైనంత ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని దిశా నిర్దేశం చేశారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
News September 27, 2024
హైకోర్టుకు గజ్జల లక్ష్మి.. తీర్పు రిజర్వు
AP: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా తన నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేయడం పట్ల గజ్జల లక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. 2026 వరకు రాజ్యాంగబద్ధ హోదాలో పదవీకాలం ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం తనను తొలగించారని కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే నియమించబడ్డారని, ఆగస్టుతో పదవీ కాలం ముగిసిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది అన్నారు. వాదనల అనంతరం తీర్పును కోర్టు రిజర్వు చేసింది.
News September 27, 2024
ప్రశాంత్ వర్మ చేతికి బాలయ్య ల్యాండ్ మార్క్ సినిమాలు?
నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఆదిత్య 369, భైరవ ద్వీపం సినిమాలు రెండు మైలురాళ్లు. వాటి సీక్వెల్స్ ఆలోచన తనకుందని ఆయన పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఆ బాధ్యతను హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. మోక్షజ్ఞ హీరోగా అవి తెరకెక్కుతాయని సమాచారం. ప్రశాంత్ మోక్షుతో తీస్తున్న సినిమా అవుట్పుట్ను బట్టి ఆ ప్రాజెక్టుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.