News September 26, 2024
పులివెందుల: వివాహేతర సంబంధం.. రాళ్లతో కొట్టి చంపారు.
పులివెందులలో వేముల మండలం చాగలేరుకు చెందిన రామాంజనేయులుపై బుధవారం ఉదయం ఇద్దరు రాడ్లతో తలపై దాడి చేశారు. ఓ మహిళతో రామాంజనేయులు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమె కొడుకులు సందీప్, శివ నాగేంద్ర రామాంజనేయుని తీవ్రంగా గాయపరిచినట్లు సీఐ గంగనాథ్ తెలిపారు. క్షతగాత్రుడిని తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు పేర్కొన్నారు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.
Similar News
News September 29, 2024
వేంపల్లి: యూట్యూబర్పై కేసు నమోదు
వేంపల్లెలో ఓ యూట్యూబ్ ఛానెల్ అధినేతపై కేసు నమోదు చేశారు. తన ఛానెల్లో పని చేస్తున్న యువతిని వేధించిన కేసులో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు CI సురేష్ రెడ్డి తెలిపారు. ‘అతడి ఛానెల్లో యాంకర్గా పనిచేసే సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడ మానేసినా వేధింపులు అపలేదు. తాను అతడి మాటలు వినలేదని తన ఆఫీసు నుంచి నా సర్టిఫికేట్లు తీసుకెళ్లానని అబద్దపు కేసు పెట్టారు’ అని ఫిర్యాదులో తెలిపింది.
News September 28, 2024
కడప జిల్లాలో టెట్ పరీక్షలు.. పరీక్షా కేంద్రాలు ఇవే
<<14220966>>కడప<<>> జిల్లాలో అక్టోబర్ 3 నుంచి జరిగే టెట్ పరీక్షా కేంద్రాల వివరాలు.
☛ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ KORM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కడప
☛ KSRM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కడప
☛ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ KLM ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కడప
☛ SRIT ప్రొద్దుటూరు
☛ CBIT ప్రొద్దుటూరు
News September 28, 2024
కడప జిల్లాలో టెట్ పరీక్షలు.. 8 కేంద్రాల ఏర్పాటు
అక్టోబర్ 03 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్లలో APTET కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://aptet.apcfss.in నందు పొంద గలరని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.