News September 26, 2024
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తలు రద్దీ కొనసాగుతోంది. ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న స్వామి వారిని 77,939 మంది దర్శించుకున్నారు.
Similar News
News March 11, 2025
చిత్తూరుకు ఒరిగిందేమీ లేదు: చింతా

కాంగ్రెస్తోనే SC, STలకు మేలు జరుగుతుందని మాజీ ఎంపీ చింతా మోహన్ ఉద్ఘాటించారు. జీడీ నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ పేరుతో మోసం చేస్తున్నాయని చప్పారు. కాంగ్రెస్ పెట్టిన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ను సైతం వైసీపీ ప్రభుత్వం మూసేసిందన్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే బాటలోనే నడుస్తోందని మండిపడ్డారు. వైసీపీ, కూటమి ప్రభుత్వంలోనూ చిత్తూరు జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు.
News March 11, 2025
చిత్తూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 167 అర్జీలు

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 167 ఫిర్యాదులు అందినట్టు అధికారులు సోమవారం తెలిపారు. రెవెన్యూ 112, పంచాయతీ రాజ్ ఒకటి, పోలీస్ శాఖ 11, పంచాయతీరాజ్కు మూడు ఫిర్యాదులు వచ్చినట్టు వారు వెల్లడించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు.
News March 10, 2025
చిత్తూరు DMHO కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లా వైద్య అధికారిని డాక్టర్ సుధారాణి జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ NCD 3.0 స్కానింగ్ క్వాలిటీగా చేయాలని అన్నారు గర్భిణీ స్త్రీలకు రక్తహీనత పరీక్షలు ఎప్పటికప్పుడు చేసి తగిన వైద్యం చెయ్యాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు.