News September 26, 2024
లిప్స్టిక్ వేసుకుందని ట్రాన్స్ఫర్ చేసేశారు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92024/1727324779196-normal-WIFI.webp)
లిప్స్టిక్ వేసుకుందనే కారణంతో చెన్నై మేయర్ ప్రియ తన దఫేదార్ మాధవిని బదిలీ చేయించారు. హఠాత్తుగా ఆమెను మనలి మండలానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మేయర్ వేసుకునే రంగులోనే దఫేదార్ కూడా లిప్స్టిక్ వేసుకు రావడంతో బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. 15 ఏళ్లుగా లిప్స్టిక్ వేసుకుంటున్నానని, దీనిని ఉన్నట్టుండి మార్చుకోమనడం సబబు కాదని మాధవి వాదిస్తోంది ఈ వార్తలను కార్పొరేషన్ ఖండించింది.
Similar News
News December 22, 2024
అమెరికాలో పెగాసస్ ప్రకంపనలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734841077474_1124-normal-WIFI.webp)
పెగాసస్ స్పైవేర్ మళ్లీ వెలుగులోకొచ్చింది. ఈ స్పైవేర్ను వృద్ధి చేసిన Israel కంపెనీ NSO చట్ట వ్యతిరేక చర్యలను USలోని ఓ కోర్టు మొదటిసారిగా గుర్తించింది. WhatsApp వేసిన కేసులో 1400 మంది యూజర్లపై దీన్ని వాడినట్టు కోర్టు నిర్ధారించింది. 2021లో 300 మందిపై NDA Govt నిఘా పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు కమిటీ విచారించింది. విచారణలో కేంద్రం తమకు సహకరించలేదని కమిటీ తెలిపింది.
News December 22, 2024
అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదు: పురందీశ్వరి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734842433020_653-normal-WIFI.webp)
అల్లు అర్జున్, సీఎం రేవంత్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందీశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదని, ఒక హీరోగా అర్జున్ అక్కడికి వెళ్లారని చెప్పారు. కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా ఏ11గా ఉన్న ఆయనను అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
News December 22, 2024
పుణ్యక్షేత్రాల్లో పెరిగిన రద్దీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734841428444_1045-normal-WIFI.webp)
వారాంతం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో శ్రీనివాసుడి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,411మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా హుండీకి రూ.3.44 కోట్ల ఆదాయం సమకూరింది. అటు యాదాద్రిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.