News September 26, 2024
NLG: ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

NLG జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. రైతుల ద్వారా బయోమెట్రిక్ లేదా ఐరిస్ సేకరించిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేయాలనే విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో గతంలో ఇచ్చిన బయోమెట్రిక్ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News December 29, 2025
యాసంగి ప్రారంభంలోనే రైతన్నకు కష్టాలు!

అన్నదాతలకు యాసంగి ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. గత 15 రోజులుగా జిల్లాలో ఉష్ణోగత్రలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. దీంతో వరి నాటు వేసిన పొలాలు చలికి దెబ్బతింటున్నాయి. జిల్లా వ్యాప్తంగా రబీలో 5,64,678 ఎకరాల్లో వరి, వేరుశనగ ఇతర రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కాగా వేసిన నాట్లు ఏమాత్రం ఎదగకపోగా చలి తీవ్రతకు నాటంతా చనిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
News December 29, 2025
మిర్యాలగూడ : ’44 ఏళ్ల తర్వాత కలిశారు’

మిర్యాలగూడ పట్టణంలోని బకాల్ వాడ ఉన్నత పాఠశాలలో 44 వసంతాల ఆత్మీయ కలయికతో 1980-81లో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాఠశాలలో మొదలైన స్నేహం ఎంతో అపురూపమని, స్నేహ బంధం విలువ వెలకట్టలేనిదని వారిలో ఒకరైన పూర్వ విద్యార్థి రామశేఖర్ అన్నారు.
News December 29, 2025
బకాల్వాడ: 44 వసంతాల ఆత్మీయ కలయిక

మిర్యాలగూడ పట్టణంలోని బకాల్ వాడ ఉన్నత పాఠశాలలో 44 వసంతాల ఆత్మీయ కలయికతో 1980-81లో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాఠశాలలో మొదలైన స్నేహం ఎంతో అపురూపమని, స్నేహ బంధం విలువ వెలకట్టలేనిది వారిలో ఒకరైన పూర్వ విద్యార్థి రామశేఖర్ అన్నారు.


