News September 26, 2024
బైరెడ్డిపల్లి: హార్ట్ ఎటాక్తో హెడ్ కానిస్టేబుల్ మృతి

హార్ట్ ఎటాక్తో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న చలపతి హార్ట్ ఎటాక్తో మృతి చెందినట్లు సహచర పోలీసు సిబ్బంది తెలియజేశారు. స్టేషన్లో ఎస్సై, ఏఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News February 9, 2026
కార్వేటినగరంలో కోళ్లు మృతి.. DMHO తనిఖీలు

కార్వేటినగరం(M) RKVBపేటలో ఇందిరా కాలనీ వద్ద కోళ్ల ఫారంలో నాలుగు రోజులుగా కోళ్లు మృతి చెందుతున్నాయి. దీనిపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం DMHO సుధారాణి కోళ్లఫారం ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
News February 9, 2026
వినతులకు సత్వర పరిష్కారం చూపండి: కలెక్టర్

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. సంబంధిత శాఖ అధికారులు ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్కు వచ్చినా ఫిర్యాదు మళ్లీ రాకుండా బాధితుల పరిధిలోనే పరిష్కరించేలా చూడాలని సూచించారు.
News February 9, 2026
సదుం: ‘నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి’

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కోళ్ల ఫారం నిర్వాహకులు జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలని అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జెడి గుణశేఖర్ పిళ్ళై సూచించారు. ఫారంల వద్దకు దాణా, కోడిగుడ్లు సరఫరా చేసే వాహనాలను, ఇతర వ్యక్తులను రాకుండా చూడాలన్నారు. కోళ్ల ఉత్పత్తులు ఆహారం లో వినియోగించేవారు 100 డిగ్రీలు వేడి చేసి వాటిని తినాలని తెలిపారు.


