News September 26, 2024
ఫేక్ న్యూస్పై రిషభ్ పంత్ ఆగ్రహం

తాను RCBలోకి వెళ్లేందుకు యత్నించగా విరాట్ అడ్డుకున్నారని ఓ నెటిజన్ చేసిన ట్వీట్పై రిషభ్ పంత్ మండిపడ్డారు. సెన్సిబుల్గా ఉండటం నేర్చుకోవాలని క్లాస్ పీకారు. ‘ఇది ఫేక్ న్యూస్. ఎందుకు ఇలాంటి వార్తల్ని వ్యాప్తి చేస్తారు? ఇదేమీ ఫస్ట్ టైమ్ కాదు. రోజురోజుకూ తప్పుడు వార్తల ప్రచారం పెరుగుతోంది. ఇది కేవలం మీకు మాత్రమే కాదు. ఇలాంటి పనులు చేసే వారందరికీ కూడా చెబుతున్నా’ అని స్పష్టం చేశారు.
Similar News
News November 13, 2025
నేడు దానధర్మాలు చేస్తే..?

గురువారం చాలామంది సాయిబాబాను పూజిస్తారు. అయితే ఆయన పూజతో పాటు నేడు దానధర్మాలు చేయడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. పేదలకు ఆహారం, వస్త్రాలు దానం చేస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందంటున్నారు. దానాలు చేస్తే సంపద పెరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది. ఇలా 9 వారాలు చేసి, సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటే వృత్తి-వ్యాపారాలలో పురోగతి ఉంటుందని, కుటుంబంలో శాంతి లభిస్తుందని నమ్మకం.
News November 13, 2025
‘పీక్ కోల్డ్వేవ్’: తెలంగాణపై చలి పంజా!

రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఈరోజు నుంచి ‘పీక్ కోల్డ్వేవ్’ పరిస్థితులు ప్రారంభం కానున్నాయి. రాత్రి, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు 10°C-8°C వరకు పడిపోయే అవకాశం ఉంది. ఈనెల 18 వరకు ఇది కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లోనూ టెంపరేచర్ 13°C-11°Cకి పడిపోతుందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.
News November 13, 2025
నేటి నుంచి టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు

AP: నేటి నుంచి ఈ నెల 25 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా టెన్త్ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు రూ.50, డిసెంబర్ 10 వరకు రూ.200, డిసెంబర్ 15 వరకు రూ.500 లేట్ ఫీజుతో చెల్లించవచ్చని వెల్లడించారు. ఫీజును https://bse.ap.gov.inలో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. గడువు పొడిగింపు ఉండబోదని స్పష్టంచేశారు.


