News September 26, 2024

గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రవాసి ప్రజావాణి ఏర్పాటు: మంత్రి పొన్నం

image

మహాత్మ జ్యోతిరావు పులే ప్రజాభవన్‌లో రేపు గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం “ప్రవాసి ప్రజావాణి” కి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ తెలిపారు. గల్ఫ్ సమస్యలు ఏమున్నా పరిష్కారం కోసం ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్‌ను ఉపయోగించుకోవాలన్నారు. జ్యోతిరావు పూలే భవన్లో ప్రతి బుధ, శుక్రవారంలో ప్రవాసి ప్రజావాణి కౌంటర్ ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News January 26, 2026

KNR: TNGOs భవన్లో ఘనంగా గణతంత్ర వేడుకలు

image

కరీంనగర్ TNGOs భవన్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TNGOs జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, సేవాభావంతో విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TNGOs నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

News January 25, 2026

KNR: ఎస్సారెస్పీ కాలువలో రైతు గల్లంతు

image

శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన యువరైతు సదుల అనిల్ ఎస్సారెస్పీ కాలువలో గల్లంతయ్యాడు. పొలం పనుల అనంతరం కాలువలో బురద బట్టలు శుభ్రపరుస్తుండగా ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ఎస్సారెస్పీ అధికారుల సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 25, 2026

పోలీసుల విధుల్లో నైపుణ్యం అవసరం: సీపీ గౌష్ ఆలం

image

కరీంనగర్ పోలీస్ పరేడ్ మైదానంలో ఆదివారం వార్షిక డీ-మొబిలైజేషన్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ గౌష్ ఆలం సిబ్బంది వందనాన్ని స్వీకరించారు. శిక్షణతోనే వృత్తిపరమైన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆయన తెలిపారు. నెల రోజులుగా ఆయుధాల వినియోగం, భద్రతా నియమాలు, ఫైరింగ్‌పై శిక్షణ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు వెంకటరమణ, భీంరావు తదితరులు పాల్గొన్నారు.