News September 27, 2024
సచిన్ రికార్డు విరాట్కు దక్కకపోవచ్చు: హాగ్
టెస్టు క్రికెట్లో సచిన్ అత్యధిక పరుగుల(15,921) రికార్డును బ్రేక్ చేయడం కోహ్లీ(8871) వల్ల కాకపోవచ్చని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పారు. ‘విరాట్ ఆ రికార్డును అందుకుంటారని అనుకోను. ఆయన లయ కోల్పోయారు. వచ్చే 10 మ్యాచుల్లో గాడిలో పడకపోతే ఇక ఆ రికార్డు రేసు నుంచి విరాట్ తప్పుకొన్నట్లే. ఇప్పటికే 12వేల పరుగులకు చేరుకున్న జో రూట్కు సచిన్ను దాటే ఛాన్స్ ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News September 27, 2024
రూ.6.61 లక్షల కోట్ల రుణం సేకరించనున్న కేంద్రం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లో రూ.6.61 లక్షల కోట్ల రుణాన్ని కేంద్రం సమీకరించనుంది. ఇందుకోసం అక్టోబర్- మార్చి మధ్య రూ.20 వేల కోట్ల సావరిన్ బాండ్లతో పాటు సెక్యూరిటీల వేలం నిర్వహించనుంది. ఈ మొత్తంతో రెవెన్యూ లోటు భర్తీ చేయనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14.01 లక్షల కోట్ల రుణాన్ని సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తొలి 6 నెలల్లో రూ.7.4 లక్షల కోట్లను సేకరించింది.
News September 27, 2024
28న రాష్ట్రానికి రానున్న జేపీ నడ్డా
TG: ఈ నెల 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకోనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలతో సమావేశమవుతారు. బేగంబజార్లో నిర్వహించే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నడ్డా పాల్గొంటారు.
News September 27, 2024
పునరావసం కల్పించాకే ఇళ్లు కూల్చండి: తమ్మినేని
TG: మూసీ అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేయొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పించిన తర్వాతే ఇళ్లను కూల్చే పనులు చేపట్టాలన్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే బలహీనవర్గాల ప్రజలే అక్కడ ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వారికి HYD శివార్లలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తే పనులకు వెళ్లేందుకు కష్టతరంగా మారుతుందని తెలిపారు.