News September 27, 2024

పునరావసం కల్పించాకే ఇళ్లు కూల్చండి: తమ్మినేని

image

TG: మూసీ అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేయొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పించిన తర్వాతే ఇళ్లను కూల్చే పనులు చేపట్టాలన్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే బలహీనవర్గాల ప్రజలే అక్కడ ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వారికి HYD శివార్లలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తే పనులకు వెళ్లేందుకు కష్టతరంగా మారుతుందని తెలిపారు.

Similar News

News October 28, 2025

మొంథా తుఫాను.. ఈ జిల్లాల్లో రాకపోకలు బంద్

image

AP: మొంథా తుఫాను నేపథ్యంలో కృష్ణా, ఏలూరు, తూ.గో., ప.గో., అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో రాకపోకలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు రాత్రి 8PM నుంచి రేపు 6AM వరకు ఈ జిల్లాల్లోని నేషనల్ హైవేలతో పాటు అన్ని రోడ్లపై వాహనాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కేవలం మెడికల్ సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించారు.

News October 28, 2025

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

image

TG: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్‌పల్లి, మియాపూర్, నిజాంపేట్, అల్వాల్, కాప్రాలో వాన పడుతోంది. రాత్రి 7.30 గంటల్లోపు నగరమంతా వర్షం విస్తరిస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News October 28, 2025

సర్జరీ విజయవంతం.. కోలుకున్న శ్రేయస్!

image

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నారని Cricbuzz తెలిపింది. Spleen(ప్లీహం)కు గాయం కాగా సిడ్నీ వైద్యులు మైనర్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారని చెప్పింది. నిన్ననే ICU నుంచి బయటికొచ్చిన అయ్యర్‌ మరో 5 నుంచి 7 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొంది. ఇదే నిజమైతే అతడు త్వరలో మైదానంలో అడుగుపెట్టే ఛాన్సుంది.