News September 27, 2024

తిరుమలకు నేడు YS జగన్

image

YCP అధినేత జగన్ నేడు తిరుమలకు రానున్నారు. లడ్డూ వివాదం కొనసాగుతున్న వేళ జగన్ పర్యటన సామాన్య ప్రజలతో పాటూ పోలీసులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మధ్యాహ్నం 4.50కు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న జగన్, అక్కడి నుంచి రోడ్డు మార్గాన 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. 28న ఉదయం 10:30కు శ్రీవారిని దర్శించుకుంటారు. కాగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉప్పటికే పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Similar News

News March 12, 2026

‘గ్యాస్ సరఫరా’పై చిత్తూరు SP సీరియస్ వార్నింగ్

image

చిత్తూరు జిల్లాలో గ్యాస్ సరఫరాపై అసత్య కథనాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని SP తుషార్ డూడీ హెచ్చరించారు. ‘యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ సిలిండర్ కొరత, ధరలు భారీగా పెరిగాయి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు’ లాంటి సమాచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మొద్దన్నారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

News March 12, 2026

చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది కష్టమే.!

image

ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండనుందని AACPC ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ టి.ప్రతిమ తెలిపారు. వేడి గాలులతో పాటు తేమ శాతం తగ్గడంతో ఉక్కపోతతోపాటు, గతేడాది కన్నా 1.5 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు తేమ శాతం అందించే పంటలతో పాటు వేడిని తట్టుకోగల పంటలు వేసుకోవాలని Way2News ద్వారా ఆమె సూచించారు. మీ ప్రాంతంలో ఎండలు పెరిగాయా?

News March 12, 2026

చిత్తూరు: వంట గ్యాస్ కోసం పరుగులు.!

image

రొంపిచర్ల మండలంలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు గోడౌన్ వద్దకు పరుగులు తీస్తున్నారు. రెండు రోజులుగా వినియోగదారులతో గ్యాస్ ఆఫీస్ కిటకిటలాడుతోంది. యుద్ధం కారణంగా గ్యాస్ దొరకదేమో అని జాగ్రత్తలు పడుతున్నారు. రంజాన్, ఉగాది పండుగలు వస్తుండటంతో వంటగ్యాస్ కోసం ఆరాటపడుతున్నారు. బుక్ చేసి OTP చెప్పినవారికే గ్యాస్ ఇస్తున్నారు. మరి కొంత మంది నెట్వర్క్ పనిచేయక నిరాశ చెంది వెనుతిరుగుతున్నారు.