News September 27, 2024

KKR మెంటార్‌గా డ్వేన్ బ్రావో

image

వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. కానీ, ఐపీఎల్‌-2025లో మెంటర్‌గా తిరిగి తన మార్క్‌ను చూపేందుకు సిద్ధమయ్యారు. కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా బ్రావోను నియమిస్తున్నట్లు KKR తెలిపింది. గత సీజన్‌లో మెంటార్‌గా ఉన్న గంభీర్ టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా వెళ్లారు. ఆయన స్థానంలో జట్టు గెలుపు కోసం బ్రావో కృషి చేయనున్నారు.

Similar News

News September 27, 2024

కుప్పకూలిన బంగారు గని.. 15 మంది మృతి

image

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ సుమత్రలో కొండచరియలు విరిగిపడటంతో అక్రమ బంగారు గని కుప్పకూలి 15 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో ఏడుగురు గల్లంతైనట్లు పేర్కొన్నారు. రిమోట్ ఏరియా కావడంతో రవాణా సదుపాయం సరిగా లేదని వెల్లడించారు. దీంతో సహాయక చర్యలకు ఆలస్యమవుతున్నట్లు చెప్పారు.

News September 27, 2024

కేరళలో ఎంపాక్స్ రెండో కేసు నమోదు

image

కేరళలో ఎంపాక్స్ రెండో కేసు నిర్ధారణ అయ్యింది. ఎర్నాకుళం వాసికి ప‌రీక్ష‌ల్లో వైరస్‌ పాజిటివ్‌గా తేలిన‌ట్టు కేరళ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, ఏ స్ట్రెయిన్ అన్న‌ది ఇంకా నిర్ధార‌ణకాలేదు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స అందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. Sep 18న కేర‌ళ‌లోని మ‌ల‌ప్పురంలో UAE నుంచి వ‌చ్చిన వ్య‌క్తికి వైర‌స్ పాజిటివ్‌గా తేలడంతో దేశంలోనే మొద‌టి కేసు న‌మోదైంది.

News September 27, 2024

ఆ డేటింగ్ యాప్‌లో హీరోలూ ఉన్నారు: ఊర్వశీ రౌతేలా

image

తనతోపాటు చాలా మంది సెలబ్రిటీలు ‘రాయ’ డేటింగ్ యాప్‌లో ఉన్నారని హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తెలిపారు. మాట్లాడుకోవడం కోసమే ఈ యాప్‌లో చేరినట్లు ఆమె చెప్పారు. హృతిక్ రోషన్, ఆదిత్యరాయ్ కపూర్, అర్జున్ కపూర్ వంటి స్టార్లు యాప్‌లో చేరారని పేర్కొన్నారు. ఫ్రెండ్స్ కోసమే ఈ యాప్‌లో చేరానని, దీనిని మరో కోణంలో చూడొద్దని ఆమె అన్నారు. కాగా టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్‌తో ఊర్వశి డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి.