News September 27, 2024
కృష్ణా: పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు
పండుగల సందర్భంగా విజయవాడ మీదుగా MGR చెన్నై సెంట్రల్(MAS), షాలిమార్(SHM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.02841 SHM- MAS ట్రైన్ను ఈ నెల 30 నుంచి నవంబర్ 18 వరకు ప్రతి సోమవారం, నం.02842 MAS-SHM ట్రైన్ను అక్టోబర్ 2 నుంచి నవంబర్ 20వరకు ప్రతి బుధవారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు విజయనగరం, రాజమండ్రి, గూడూరు తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News September 29, 2024
సీఎం చంద్రబాబుతో సిద్దార్థనాథ్ సింగ్ భేటీ
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత సిద్దార్థనాథ్ సింగ్ శనివారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం గత 100 రోజులుగా రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి సీఎంతో చర్చించానని సిద్దార్థనాథ్ సింగ్ ట్విట్టర్(X)లో పోస్ట్ చేశారు.
News September 29, 2024
కృష్ణా: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLM కోర్సు విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 15,16,17 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.
News September 28, 2024
విజయవాడ: మధ్యాహ్న భోజన పథకం అమలుపై వర్క్షాప్
కలెక్టర్ జి.సృజన శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో విజయవాడ కలెక్టరేట్లో వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్లో DSEO యూవీ సుబ్బారావు, న్యూట్రిషనిస్ట్ డా.సుష్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం మెనూ అమలు, తదితర అంశాలపై కలెక్టర్ జి. సృజన క్షేత్రస్థాయి అధికారులకు పలు కీలక సూచనలిచ్చారు.