News September 27, 2024
జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటాం: స్వామీజీలు
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని స్వామీజీలు హెచ్చరించారు. ‘గత ఐదేళ్లలో జగన్ తిరుమల పవిత్రతను కాపాడలేదు. దర్శనానికి వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వలేదు. మరోసారి తిరుమలలో జగన్ డ్రామాకు తెరతీసే అవకాశం ఉంది. అలిపిరి దగ్గరే మాజీ సీఎంను అడ్డుకుంటాం.’ అని వారు హెచ్చరించారు.
Similar News
News September 27, 2024
INDvsBAN: స్టేడియంలో కొండముచ్చులతో భద్రత!
ఇండియా- బంగ్లాదేశ్ రెండో టెస్టును చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను కోతుల నుంచి రక్షించేందుకు గ్రీన్ పార్క్ స్టేడియం నిర్వాహకులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కోతులు ప్రేక్షకుల మొబైల్స్, ఆహారం, ఇతర వస్తువులను దొంగిలిస్తుండేవి. ఈ క్రమంలో కోతులను తరిమేలా కొండముచ్చులను బరిలోకి దింపేందుకు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం స్టేడియంలో కొండముచ్చులు భద్రతనిస్తున్నాయి.
News September 27, 2024
హిందూ మతాన్ని నమ్మడం, వాడుకోవడం వేర్వేరు: పూనమ్ కౌర్
AP: తిరుమల లడ్డూ, హిందూ మతంపై చర్చల వేళ హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘హిందూయిజాన్ని స్వలాభం కోసం వాడుకోవడం, హిందూ మతాన్ని నమ్మే వ్యక్తిగా ఉండటం వేరు’ అని రాసుకొచ్చారు. దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
News September 27, 2024
చంద్రబాబును బీజేపీ ఎందుకు మందలించడం లేదు?: జగన్
AP: బీజేపీ అగ్రనేతలపై YCP అధినేత జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘హిందూయిజానికి తామే ప్రతినిధులమని BJP నేతలు చెప్పుకుంటారు. మీ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుమల లడ్డూ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వర స్వామి వైభవాన్ని అబద్ధాలతో నాశనం చేస్తున్నారు. కొవ్వు ఉన్న నెయ్యి వాడకపోయినా వాడినట్లు చెబుతున్న చంద్రబాబును ఎందుకు మందలించడం లేదు? మీ వాళ్లు ఏంచేసినా ఫర్వాలేదా? ఇదెక్కడి హిందూయిజం?’ అని నిలదీశారు.