News September 27, 2024
సరోగసీ తల్లికీ 6 నెలల మాతృత్వ సెలవు
ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు 180 రోజులపాటు మాతృత్వ సెలవులు ప్రకటిస్తూ ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే సరోగసీ ద్వారా తల్లి అయిన మహిళలకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. సరోగసీ తండ్రులకూ 15 రోజులపాటు పితృత్వ సెలవులు ఉంటాయని పేర్కొంది. తొలి రెండు కాన్పులకే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన సరైన మెడికల్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుందని సూచించింది.
Similar News
News September 27, 2024
చంద్రబాబు చేసిన పాపం ప్రజలపై పడకుండా పూజలు చేయాలి: జగన్
AP: మానవత్వం చూపేదే హిందూ మతమని, మానవత్వం చూపనివాళ్లు తాము హిందువని చెప్పుకోలేరని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ‘తిరుమల గొప్పదనాన్ని, లడ్డూ విశిష్టతను చంద్రబాబే నాశనం చేశారు. నన్ను గుడికి పంపినా, పంపకపోయినా CBN చేసిన పాపం ప్రజల మీద పడకుండా ఉండేందుకు ప్రతి నియోజకవర్గంలో పూజలు నిర్వహించాలి’ అని పిలుపునిచ్చారు.
News September 27, 2024
గ్రేటర్లో వాటిపై నిషేధం విధించిన ఆమ్రపాలి
TG: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలో గోడలపై పోస్టర్లు, పెయింటింగ్స్, వాల్ రైటింగ్స్ వేయడంపై నిషేధం విధించారు. అనుమతులు లేకుండా ఏమైనా చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సినిమా వాళ్లు సైతం అనుమతులతో వాల్ పోస్టర్లు వేయాలన్నారు. ఈ అంశంపై లోకల్ ప్రింటర్స్తో మాట్లాడాలని డిప్యూటీ కమిషనర్లను ఆమె ఆదేశించారు.
News September 27, 2024
మీరు మౌన ప్రేక్షకులు.. ఎయిర్ క్వాలిటీ ప్యానల్పై SC ఫైర్
ఢిల్లీలో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు, కాలుష్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోనందుకు ఎయిర్ క్వాలిటీ ప్యానెల్పై సుప్రీంకోర్టు మండిపడింది. పంట వ్యర్థాలు కాల్చకుండా CAQM ఎలాంటి కమిటీలను ఏర్పాటు చెయ్యకపోవడాన్ని తప్పుబట్టింది. ‘ఏటా పంట వ్యర్థాల దహనాన్ని చూస్తున్నాం. CAQM చట్టాన్ని పాటించడం లేదు. ఒక్క చర్యనైనా తీసుకున్నట్టు చూపండి? మీరు మౌన ప్రేక్షకులు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.