News September 27, 2024
కుప్పకూలిన బంగారు గని.. 15 మంది మృతి
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ సుమత్రలో కొండచరియలు విరిగిపడటంతో అక్రమ బంగారు గని కుప్పకూలి 15 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో ఏడుగురు గల్లంతైనట్లు పేర్కొన్నారు. రిమోట్ ఏరియా కావడంతో రవాణా సదుపాయం సరిగా లేదని వెల్లడించారు. దీంతో సహాయక చర్యలకు ఆలస్యమవుతున్నట్లు చెప్పారు.
Similar News
News September 27, 2024
జగన్ చట్టాన్ని ఉల్లంఘించారు: చంద్రబాబు
AP: తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి అనేక మంది ఇతర మతస్థులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘చట్టాన్ని గౌరవించాల్సిన మొదటి వ్యక్తి సీఎం. ఆ హోదాలోనే జగన్ చట్టాన్ని ఉల్లంఘించారు. గతంలో డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పడానికి ఆయనకు సిగ్గుండాలి. జగన్కు విశ్వసనీయత లేదు. దేవుడి వద్దకు వెళ్లే ఎవరైనా ఆ ఆచారాలను పాటించాల్సిందే. మత సామరస్యాన్ని పాటిద్దాం’ అని స్పష్టం చేశారు.
News September 27, 2024
డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్కు ఇబ్బంది ఏంటి?: సీఎం
AP: బైబిల్ చదువుతానని చెప్పిన YS జగన్కు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ‘అన్య మతస్థులు ఎవరు వచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఎన్నో ఏళ్లుగా డిక్లరేషన్ అనేది ఉంది. CMగా ఉన్నప్పుడు ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదు. అప్పుడు చేసినట్లుగా ఇప్పుడూ చేస్తానంటే ఎలా? చట్టాలు, సంప్రదాయాలను గౌరవించడంలో సీఎం మొదటి వ్యక్తిగా ఉండాలి’ అని సీఎం సూచించారు.
News September 27, 2024
అగ్నివీర్లకు శుభవార్త చెప్పిన బ్రహ్మోస్ ఏరోస్పేస్
కనీసం 15% టెక్నికల్ ఖాళీలను అగ్నివీర్లకు రిజర్వ్ చేస్తున్నట్టు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రకటించింది. అలాగే, ఔట్సోర్సింగ్ కార్యకలాపాలు, అడ్మినిస్ట్రేటివ్, సెక్యూరిటీ విభాగాల్లో 50% ఖాళీలను వీరి ద్వారా భర్తీ చేయనుంది. సాయుధ దళాలలో 4 ఏళ్ల సేవ తర్వాత అగ్నివీర్లు తమ తమ రంగాలలో నైపుణ్యంతో పాటు లోతైన క్రమశిక్షణ, జాతీయవాదాన్ని పెంపొందించుకుంటారని సంస్థ డిప్యూటీ CEO Dr. సంజీవ్ కుమార్ పేర్కొన్నారు.