News September 27, 2024

ఇది నిశ్శబ్ద విప్లవం: మన్‌సుఖ్ మాండవీయ

image

PM మోదీ తీసుకొచ్చిన విధానాలతో గత ఏడేళ్లలో మహిళా కార్మికులు రెట్టింపయ్యారని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. ప్రస్తుతం కొన్ని సెక్టార్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సమయం పనిచేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో దీని గురించి మరింతగా మాట్లాడుకుంటామన్నారు. ఈ మార్పును నిశ్శబ్ద విప్లవంగా అభివర్ణించారు. మహిళలు ముందుండి బాధ్యతలు తీసుకుంటూ అడ్డంకులను బద్దలు కొడుతున్నారని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.

Similar News

News November 3, 2025

ఇతిహాసాలు క్విజ్ – 55

image

1. అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు?
2. విచిత్రవీర్యుని తండ్రి ఎవరు?
3. కృష్ణుడు గోవర్ధన గిరిని ఎన్ని రోజులు ఎత్తి పట్టుకున్నాడు?
4. మనిషి శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలు ఏమంటారు?
5. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడాన్ని ఏమంటారు?
– సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 3, 2025

పశువుల పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

image

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల సేపునకు అవసరమయ్యే ఆక్సిటోసిన్‌ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో కేవలం 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో పూర్తి వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.

News November 3, 2025

BELలో 47 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>)లో 47 కాంట్రాక్ట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE, బీటెక్, BSc(ఇంజినీరింగ్), ME, ఎంటెక్, MCA ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.150. SC, ST, PWBDలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://bel-india.in/