News September 27, 2024

వాడని నెయ్యిపై తప్పుడు ప్రచారం ఎందుకు?: జగన్

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారని YS జగన్ వెల్లడించారు. ’22న EO నివేదికలో కూడా ట్యాంకర్లను వెనక్కి పంపినట్లు ఉంది. EO చెప్పినా కూడా CM రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారు. జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధాలు ఆడుతూ తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. జరగనిది జరిగినట్లుగా అబద్ధాన్ని ప్రచారం చేయడం ధర్మమేనా? ఇది అపవిత్రత కాదా?’ అని ప్రశ్నించారు.

Similar News

News January 9, 2026

గర్భాశయ రక్తస్రావం గురించి తెలుసా?

image

మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, వయస్సుతో పాటు అనేక గర్భాశయ సంబంధిత సమస్యలు స్త్రీలను ఇబ్బంది పెడుతున్నాయి. వాటిల్లో ఒకటే గర్భాశయ రక్తస్రావం. పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం, పీరియడ్స్ మధ్య స్పాటింగ్, సంభోగం తర్వాత రక్తస్రావం ఉన్నా గర్భాశయ రక్తస్రావం అంటారు. ఇది ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, PCOS, థైరాయిడ్ వల్ల వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

News January 9, 2026

శుక్రవారం ఈ పనులు చేస్తున్నారా?

image

లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజున చేసే కొన్ని పనులు దారిద్ర్యానికి దారితీస్తాయని పండితులు చెబుతున్నారు. ‘దేవుడి పటాలు శుభ్రం చేయకూడదు. పాత విగ్రహాలు బయట పడేయకూడదు. అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయవద్దు. జుట్టు, గోళ్లు కత్తిరించకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచితే లక్ష్మీ కటాక్షంతో సిరి సంపదలు కలుగుతాయి’ అని సూచిస్తున్నారు. కుబేర యోగం కలగాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News January 9, 2026

కొత్త బీడీ పొగాకు రకం ‘ABD 132’.. దీని ప్రత్యేకత ఏమిటి?

image

ABD 132 బీడీ పొగాకు రకాన్ని నంద్యాల ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. ఈ రకం పంటకాలం 195 నుంచి 210 రోజులుగా ఉంటుంది. ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగు చేయడానికి ఈ రకం అనుకూలమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇతర బీడీ పోగాకు రకాలతో పోలిస్తే దీని పొగలో హానికర అంశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇటీవల దీన్ని విడుదల చేశారు.