News September 27, 2024
చంద్రబాబూ.. మీ హయాంలో రూ.276కే నెయ్యి ఎలా కొన్నారు?: జగన్

AP: నందిని నెయ్యిని YCP హయాంలో కొనుగోలు చేయలేదని, మిగతా కంపెనీల నెయ్యిని తక్కువ ధరకు కొన్నారని చంద్రబాబు చేసిన విమర్శలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. ‘CBN హయాంలో 2015-2018 మధ్య నందిని బ్రాండ్ను ఎందుకు కొనుగోలు చేయలేదు? 2015లో కేజీ నెయ్యి ధర రూ.276, 2019లో రూ.324కు కొన్నారు. మా హయాంలో రూ.320కి కొంటే తప్పేముంది? ఇప్పుడు హెరిటేజ్ ధరలు పెంచుకోవడానికి CBN ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News February 28, 2025
చిన్నారిని చిదిమేసిన మానవమృగం.. ప్రైవేట్ పార్ట్స్ వద్ద 29 కుట్లు

ఓ మానవమృగం కామవాంఛకు ఐదేళ్ల చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఆ బాలిక ప్రైవేట్ పార్ట్స్ వద్ద 29 కుట్లు వేశామని డాక్టర్లు చెప్పడం ఆ 17 ఏళ్ల నిందితుడి రాక్షసత్వానికి నిదర్శనం. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగింది. నిందితుడు పీకలదాకా తాగి బాలిక తలను గోడకు పలుమార్లు కొట్టాడని, శరీరంపై అనేక గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేశామని, జువైనల్కు తరలిస్తామని చెప్పారు.
News February 28, 2025
BREAKING: ఆర్సీబీ ఘోర పరాజయం

WPLలో ఆర్సీబీతో జరిగిన మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 126 పరుగుల స్వల్ప టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్ 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గార్డ్నర్ (58) ఫిఫ్టీతో రాణించారు. లిచిఫీల్డ్ (30) ఫర్వాలేదనిపించారు. రేణుకా సింగ్, జార్జియా చెరో 2 వికెట్లు తీశారు.
News February 28, 2025
ఇలా చేస్తే హాయిగా నిద్ర పడుతుంది

ప్రతి ఒక్కరికీ కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. గాఢ నిద్ర రావాలంటే రాత్రి 7 గంటలలోగా భోజనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారం త్వరగా జీర్ణమై హాయిగా నిద్ర పడుతుంది. గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గి నిద్ర పడుతుంది. ఏదైనా బుక్స్ చదివినా నిద్రలోకి జారుకుంటారు. పడుకునే ముందు గ్లాసు పాలు తాగినా గాఢ నిద్ర వస్తుంది. అలాగే నువ్వులు/కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది.