News September 27, 2024
చంద్రబాబును బీజేపీ ఎందుకు మందలించడం లేదు?: జగన్
AP: బీజేపీ అగ్రనేతలపై YCP అధినేత జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘హిందూయిజానికి తామే ప్రతినిధులమని BJP నేతలు చెప్పుకుంటారు. మీ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుమల లడ్డూ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వర స్వామి వైభవాన్ని అబద్ధాలతో నాశనం చేస్తున్నారు. కొవ్వు ఉన్న నెయ్యి వాడకపోయినా వాడినట్లు చెబుతున్న చంద్రబాబును ఎందుకు మందలించడం లేదు? మీ వాళ్లు ఏంచేసినా ఫర్వాలేదా? ఇదెక్కడి హిందూయిజం?’ అని నిలదీశారు.
Similar News
News September 27, 2024
ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రేపు APలోని అల్లూరి, ఏలూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. అటు TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్ జిల్లాల్లో వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News September 27, 2024
DEVARA: రెమ్యునరేషన్ ఎవరికెంతంటే?
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది చర్చగా మారింది. ఎన్టీఆర్ ఈ సినిమాకు రూ.60 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ రూ.30 కోట్లు, సైఫ్ అలీఖాన్ రూ.10 కోట్లు, జాన్వీ కపూర్ రూ.5 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ.1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీ శర్మ రూ.40 లక్షలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
News September 27, 2024
పసిఫిక్లో చైనా నౌక.. జపాన్ ఆందోళన
చైనాకు చెందిన యుద్ధవిమాన వాహక నౌక ‘లావోనింగ్’ గత ఏడు రోజులుగా పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తోందని జపాన్ రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నౌకకు అండగా మరిన్ని చైనా నౌకలు వెంట వెళ్తున్నాయని పేర్కొంది. తమకు చెందిన ఒకినొటోరీ దీవికి సుమారు 1,020 కిలోమీటర్ల దూరంలో ఆ నౌకలతో చైనా విన్యాసాలు చేయిస్తోందని ఆరోపించింది. భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ సహా పలు ఆసియా దేశాలతో చైనాకు వివాదాలున్న సంగతి తెలిసిందే.