News September 27, 2024

వెండి ధర కేజీ రూ.1,02,000

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.430 పెరిగి రూ.77,450కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.400 పెరిగి రూ.71,000 పలుకుతోంది. ఇక వెండి రేటు కేజీ రూ.1,000 పెరిగి రూ.1,02,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News September 27, 2024

DEVARA: రెమ్యునరేషన్ ఎవరికెంతంటే?

image

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది చర్చగా మారింది. ఎన్టీఆర్ ఈ సినిమాకు రూ.60 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ రూ.30 కోట్లు, సైఫ్ అలీఖాన్ రూ.10 కోట్లు, జాన్వీ కపూర్ రూ.5 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ.1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీ శర్మ రూ.40 లక్షలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

News September 27, 2024

పసిఫిక్‌లో చైనా నౌక.. జపాన్ ఆందోళన

image

చైనాకు చెందిన యుద్ధవిమాన వాహక నౌక ‘లావోనింగ్’ గత ఏడు రోజులుగా పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తోందని జపాన్ రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నౌకకు అండగా మరిన్ని చైనా నౌకలు వెంట వెళ్తున్నాయని పేర్కొంది. తమకు చెందిన ఒకినొటోరీ దీవికి సుమారు 1,020 కిలోమీటర్ల దూరంలో ఆ నౌకలతో చైనా విన్యాసాలు చేయిస్తోందని ఆరోపించింది. భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ సహా పలు ఆసియా దేశాలతో చైనాకు వివాదాలున్న సంగతి తెలిసిందే.

News September 27, 2024

మూసీ బఫర్ జోన్ నిర్వాసితులకు పునరావాసం, పరిహారం: దానకిశోర్

image

TG: మూసీ రివర్ బెడ్ నిర్వాసితుల ఆందోళనల నేపథ్యంలో మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మూసీ బఫర్‌జోన్‌లో నిర్మాణాలపై సర్వే చేస్తామని, అక్కడ పట్టాలున్న కుటుంబాలకు పునరావాసం, పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. నదీ గర్భంలో పట్టాలున్న వారు జిల్లా కలెక్టర్లను కలవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.