News September 27, 2024
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆర్డీవోల బదిలీలు
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. అనకాపల్లి ఆర్డీవోగా షేక్ ఆయేషాను నియమించారు. విశాఖ ఆర్డీవో హుస్సేన్ సాహిబ్ను బదిలీ చేసి ఆయన స్థానంలో పోలూరి శ్రీలేఖను నియమించారు. భీమిలి ఆర్డీవో భాస్కర్ రెడ్డి స్థానంలో కె.సంగీత్ మాధుర్ బదిలీపై వచ్చారు. VMRDA సెక్రటరీని బదిలీ చేయగా ఆమెను విజయనగరం ఆర్డీవోగా నియమించారు.
Similar News
News October 10, 2024
తాతయ్యబాబుకి గృహ నిర్మాణ మంత్రి అభినందనలు
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబుకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం విజయవాడలో బాధ్యతలు చేపట్టిన తాతయ్య బాబును రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారథి అభినందించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయనకు మంత్రి సూచించారు. పేదలందరికి పక్కా గృహాలు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
News October 10, 2024
మిల్లెట్స్తో రతన్ టాటా చిత్రపటం
దాతృత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ, భారతదేశానికి, పారిశ్రామిక రంగానికి పేరు ప్రఖ్యాతి తెచ్చిన మహోన్నత వ్యక్తికి విశాఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఘన నివాళి అర్పించారు. మిలెట్స్ ఉపయోగించి రతన్ టాటా చిత్రాన్ని తయారు చేశారు. ఆ మహనీయునికి తాను ఇచ్చే నివాళి ఇది అని విజయ్ కుమార్ అన్నారు.
News October 10, 2024
విశాఖ: ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ ప్రాధాన్యతను వివరించిన టాటా
ఇంటర్ డిసిప్లినరీ రీసర్చ్ జరపాల్సిన అవసరం ఉందని రతన్ టాటా అన్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో 2018 డిసెంబర్ 10న నిర్వహించిన పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏయూతో పరిశోధన రంగంలో కలసి పనిచేయడానికి, సంయుక్త పరిశోధనలు జరిపే దిశగా యోచన చేస్తామన్నారు. విభిన్న శాస్త్రాలను సమన్వయం చేస్తూ పరిశోధనలు జరపాలన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్నవారితో గ్రూప్ ఫొటో తీసుకున్నారు.