News September 27, 2024
ప్రవాస భారతీయులు ఏ దేశంలో ఎక్కువంటే..

భారతీయులు లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదేమో! గ్లోబల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకారం.. అత్యధికంగా అమెరికాలో 44 లక్షలమంది పైచిలుకు ప్రవాసీయులు నివసిస్తున్నారు. ఆ తర్వాత UAEలో 34.25 లక్షలమంది, మలేషియాలో 29.87 లక్షలు, సౌదీలో 25.94 లక్షలు, మయన్మార్లో 20.09 లక్షలు, UKలో 17.64 లక్షలు, కెనడాలో 16.89 లక్షలు, సౌతాఫ్రికాలో 15.60 లక్షలు, మారిషస్లో 8.94 లక్షలు, సింగపూర్లో 6.50లక్షలమంది నివసిస్తున్నారు.
Similar News
News September 19, 2025
ఐదుగురు విద్యార్థులకు 9 మంది టీచర్లు!

TG: ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో సర్కారు బడుల్లో చేరే వారి సంఖ్య పెరగడం లేదు. మహబూబాబాద్(D) రాజులకొత్తపల్లి ZPHSలో ఐదుగురు విద్యార్థులకు 9మంది టీచర్లుండటమే ఇందుకు నిదర్శనం. ఈ స్కూలులో 6thలో ఒకరు, 7thలో ఇద్దరు, 8thలో ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. 9th, 10thలో ఒక్కరూ లేరు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలొస్తున్నాయి.
News September 19, 2025
ఓబుళాపురం మైనింగ్ కేసు.. సరిహద్దుల ఖరారుపై కమిటీ

AP: ఓబుళాపురం మైనింగ్ కేసులో సరిహద్దుల ఖరారుపై జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలో సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆ కమిటీని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది. సరిహద్దు వివాదం ముగిసిందని, మైనింగ్ కొనసాగించడానికి గాలి బ్రదర్స్కి అనుమతి ఇవ్వాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
News September 19, 2025
స్పీకర్ కార్యాలయమే కోర్టు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం కోర్టుగా మారనుంది. పార్టీ ఫిరాయింపులపై BRS ఫిర్యాదుకు కడియం, దానం మినహా మిగతా 8 మంది స్పీకర్కు వివరణ ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని BRSకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు లేఖ రాశారు. దీంతో వచ్చే వారంలో స్పీకర్ ఛాంబర్లో అటు BRS, ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాదనలు విన్పించనున్నారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ న్యాయమూర్తి తరహాలో నిర్ణయం తీసుకుంటారు.