News September 27, 2024
ప్రవాస భారతీయులు ఏ దేశంలో ఎక్కువంటే..

భారతీయులు లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదేమో! గ్లోబల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకారం.. అత్యధికంగా అమెరికాలో 44 లక్షలమంది పైచిలుకు ప్రవాసీయులు నివసిస్తున్నారు. ఆ తర్వాత UAEలో 34.25 లక్షలమంది, మలేషియాలో 29.87 లక్షలు, సౌదీలో 25.94 లక్షలు, మయన్మార్లో 20.09 లక్షలు, UKలో 17.64 లక్షలు, కెనడాలో 16.89 లక్షలు, సౌతాఫ్రికాలో 15.60 లక్షలు, మారిషస్లో 8.94 లక్షలు, సింగపూర్లో 6.50లక్షలమంది నివసిస్తున్నారు.
Similar News
News January 17, 2026
నటి శారదకు ప్రతిష్ఠాత్మక అవార్డు

మలయాళ చిత్రసీమలో అత్యున్నత గౌరవంగా భావించే జేసీ డానియల్ అవార్డు-2024ను సీనియర్ నటి శారదకు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మలయాళ సినిమాకు ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ఇచ్చింది. రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో కూడిన ఈ అవార్డును ఈ నెల 25న CM పినరయి విజయన్ అందజేయనున్నారు. ఈ అవార్డు పొందిన 32వ సినీ ప్రముఖురాలిగా శారద నిలిచారు.
News January 17, 2026
యూరియాకు గుళికలు కలుపుతున్నారా?

వరి సాగులో చాలా మంది రైతులు మొదటి దఫా యూరియా వేసేటప్పుడు బస్తా యూరియాకు 4-5 కిలోల గుళికల మందును కలిపి చల్లుతారు. పైరు బాగా పెరగడానికి యూరియా.. పురుగుల నివారణకు గుళికల మందు ఉపయోగపడుతుందనేది రైతుల భావన. కానీ పురుగుల కట్టడికి ఎకరాకు మందు రకాన్ని బట్టి 8-10 కిలోల గుళికలు అవసరం. తక్కువ వేస్తే పురుగులు వాటిని తట్టుకొని నిలబడతాయి. అందుకే రైతులు గుళికల మందు వాడకంలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.
News January 17, 2026
C-DAC 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

బెంగళూరులోని <


