News September 28, 2024

దయచేసి విపరీతార్థాలు తీయకండి: రామజోగయ్య శాస్త్రి

image

ఎవరి పని వాళ్లను చేసుకోనిస్తే రిజల్ట్ ‘దేవర’లా ఉంటుందని తాను అన్న మాటకు విపరీతార్థాలు తీయొద్దని రామజోగయ్య శాస్త్రి ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. ‘ఓరి నాయనో. ఇది ఎటో దారితీస్తున్నట్లుంది. నా ఉద్దేశం శివ తన టెక్నీషియన్స్‌కి స్వేచ్ఛనిస్తారనే తప్ప మరొకటి కాదు. విపరీతార్థాలు తీయవద్దని మనవి’ అని ట్వీట్ చేశారు. ఎవరి పని వాళ్లను చేసుకోనివ్వాలంటూ కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో అన్న సంగతి తెలిసిందే.

Similar News

News September 28, 2024

ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయాల సేకరణ

image

TG: ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. వర్గీకరణపై వివిధ సంఘాలు, వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి మాసబ్ ట్యాంక్ లోని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో అభిప్రాయాలు ఇవ్వాలని తెలిపింది.

News September 28, 2024

ఇంగ్లిష్ మీడియా.. మా మీద పడి ఏడవకండి: గవాస్కర్

image

చెన్నైలో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడినప్పుడు పిచ్ బాలేదంటూ ఇంగ్లిష్ వార్తాసంస్థలు ఏడ్చాయని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గుర్తుచేసుకున్నారు. కాన్పూర్‌లో రెండో టెస్టు సందర్భంగా కామెంటరీలో ఆయన మాట్లాడారు. ‘జాగ్రత్తగా ఆడితే ఆ పిచ్‌పై సెంచరీ చేయొచ్చని అశ్విన్ ఆ టెస్టుకు ముందే అన్నారు. అదే చేసి చూపించారు. ఇంగ్లిష్ మీడియా మాత్రం ఇవేం పిచ్‌లు అంటూ మనపై పడి ఏడ్చింది. ఆ ఏడుపులు ఆపండి’ అని పేర్కొన్నారు.

News September 28, 2024

రూ.1000 కోట్లతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి: మంత్రి

image

AP: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను రూ.1000 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. అమరావతిలో రూ.500 కోట్లతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. సంగమేశ్వరం, అఖండ గోదావరి, శ్రీశైలం, సూర్యలంక బీచ్ ల రూపురేఖలు మారుస్తామని చెప్పారు. అక్టోబర్ 15 నాటికి DPRలు సిద్ధం చేసి రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.